Ram Charan: చెల్లెలు శ్రీజతో ముంబైలో సందడి చేసిన చరణ్… ఫోటో వైరల్!

Ram Charan: టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.రామ్ చరణ్ కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ ఫోటోలో తనతోపాటు తన సోదరి శ్రీజ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి కరోనాతో బాధపడుతూ హోమ్ క్వారంటైన్ లో ఉండగా మరోవైపు రామ్ చరణ్ శ్రీజ తన పెంపుడు కుక్క రైమ్ ఇలా ముంబైలో సందడి చేయడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు. ఇక ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.

గోధుమ కలరు టాప్, బ్లూ కలర్ జీన్స్ లో రామ్ చరణ్ ఔట్ ఫిట్ అదిరిపోయేలా ఉంది.ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు పెద్దఎత్తున పలు సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు. అసలు ముంబైలో రామ్ చరణ్, శ్రీజ ఎందుకు ఉన్నారు అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

విడాకుల విషయం పై మౌనం..

అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడిపోతుందని త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఏ మాత్రం మెగా కుటుంబం స్పందించలేదు. ఇలాంటి సమయంలో వీరిద్దరూ ముంబైలో కనిపించడంతో దేనికోసం శ్రీజ ముంబై వెళ్ళింది అంటూ నెటిజన్లు ఆరాధిస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో వైరల్ గా మారింది.