సినీరంగ ప్రవేశం ఒక్కరిది ఒక్కోరకంగా ఉంటుంది.కష్టపడి ఒకరు వస్తే కడుపులో చల్ల కదలకుండా వచ్చిన వారు మరొకరు. 1990 దశకంలో తెలుగు తెరకు వచ్చిన అతికొద్ది మంది హీరోయిన్లలో ‘యమున’ ఒకరు. అసలు పేరు ‘ప్రేమ’ అయినప్పటికీ బాలచందర్ యమునగా మార్చారు. సినిమాల్లోకి వెలుదామన్న ఆలోచన కళలో కూడా చేయని ‘యమున’ తన అక్కతో పాటుగా షూటింగ్ వెళ్లినప్పుడు ప్రఖ్యాత దర్శకుడు ‘బాలచందర్’ చూడడం వెంటనే ఆమెను హీరోయిన్ గా బుక్ చేసుకోవడం జరిగింది.
ఆ వెంటనే తెలుగులో అట్లూరి రామారావు ఆడిషన్ చేసి ఉషాకిరణ్ మూవీస్ తీయబోయే చిత్రానికి యమునను ఎంపికచేయడం జరిగింది. అలా 1989 ఉషాకిరణ్ మూవీస్ నిర్మాణం, ఏ.మోహన్ గాంధీ దర్శకత్వంలో “మౌనపోరాటం” చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో వినోద్ కుమార్, యమున హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత అగ్నిప్రవేశం, ఆడది, ఉద్యమం, ఘటన, పుట్టింటి పట్టు చీర, మామగారు వంటి చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించారు. కన్నడంలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్ లాంటి హీరోలతో ఆమె నటించారు. తెలుగులో నటించిన మౌనపోరాటం, మామగారు చిత్రాలకు ఆమెకు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో యమునకు “మెగాస్టార్ చిరంజీవి” తో నటించే అవకాశం వచ్చింది.
1990 రమా ఫిలిమ్స్, కె.నాగేశ్వర్ రావు నిర్మాణం. మురళిమోహన్ రావు దర్శకత్వంలో “కొదమ సింహం” చిత్రం విడుదలయ్యింది. ఇందులో చిరంజీవి, వాణివిశ్వనాథ్, రాధ, సోనం హీరో, హీరోయిన్లుగా నటించారు. పూర్తి నిడివితో కూడిన కౌబాయ్ పాత్రలో ‘మెగాస్టార్’ ఈ చిత్రంలో నటించారు. నిర్మాత కైకాల నాగేశ్వరరావు కోరికమేరకు కౌబాయ్ చిత్రంలో నటించడానికి ఆ రోజుల్లో చిరంజీవి గారు ఒప్పుకున్నారు. ‘మౌనపోరాటం’ చిత్రంలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న యమునను కొదమ సింహంలో సోనమ్ చేసిన పాత్రకు ముందుగా సంప్రదించారు. కానీ అప్పటికే యమున అగ్నిప్రవేశం, ఆడది, ఉద్యమం, ఘటనలాంటి చిత్రాలతో బిజీగా ఉండడంతో.. చిరంజీవి డేట్స్ కి యమున డేట్స్ కుదరక పోవడంతో ఆ స్థానంలో బాలీవుడ్ నటి “సోనమ్”ను తీసుకోవడం జరిగింది.
లోగడ ఇదే పాత్రకి తెలుగులో మరొక హీరోయిన్ “నదియా”ను కూడా సంప్రదించడం గమనార్హం. ఒకవేళ చిరంజీవితో కలిసి నటిస్తే ఆ తర్వాత అనేక సినిమాల్లో స్టార్ హీరోలతో నటించే అవకాశం పొందీ ఉండేదాన్నని.. సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో సినిమాలకు డేట్స్ అడ్జస్ట్ చేయడం లాంటివి తనకు తెలిసేది కాదని అలా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కోల్పోయానని ఒక ఇంటర్వ్యూలో “యమున” చెప్పుకొచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…