Megastar Chiranjeevi : 1983 నుంచి మెగాస్టార్ చిరంజీవి వరుస హిట్లతో విజయ దుందుభి మోగించారు. ఆ క్రమంలో 1990 వచ్చేసరికి కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొదమసింహం లాంటి చిత్రాలతో బాక్సాఫీసును బద్దలు కొట్టారు. “కొండవీటి దొంగ” 1990 లో ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఒక విజయవంతమైన సినిమా. ఇందులో చిరంజీవి, విజయశాంతి, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై టి. త్రివిక్రమరావు నిర్మించాడు. పరుచూరి సోదరులు కథ నందించగా, యండమూరి వీరేంద్రనాథ్ చిత్రానువాదం సమకూర్చారు.”
కొండవీడు అనే గిరిజన గ్రామంలో రాజా అనే పిల్లవాడి తల్లిదండ్రులను కొంతమంది రౌడీలు తరుముతూ వస్తుంటారు. వాళ్ళు రాజా తండ్రిని చంపేసి ఆ నేరాన్ని తల్లి మీద మోపి జైలుకు పంపుతారు. రాజాని మాత్రం గూడెం నాయకుడు కాపాడతాడు. రాజా పట్నం వెళ్ళి బాగా చదువుకుని వస్తాడు. ఇంతకాలం తర్వాత కూడా అక్కడి ప్రజలు మోసానికి గురవుతూ ఉండటం గమనిస్తాడు. ఆ మోసాలకు కారణమవుతున్న శరభోజి, కాద్రా, అతని బృందంపై ఎదురు తిరగాలనుకుంటాడు. కానీ తనను కాపాడిన గూడెం నాయకుడు మాత్రం కొండవీటి దొంగగా అవతారం ఎత్తమని సలహా ఇస్తాడు. అలా రాజా కొండవీటి దొంగ వేషంలో ధనవంతుల దగ్గర సొమ్ము దొంగిలించి పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉంటాడు.
“జగదేకవీరుడు అతిలోకసుందరి” 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించాడు. రాఘవేంద్రరావు, జంధ్యాల కలిసి స్క్రీన్ ప్లే రాశారు. చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, అల్లు రామలింగయ్య, రామిరెడ్డి సహాయ పాత్రల్లో నటించారు.ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ కథలోకి వెళితే.. శ్రీ ఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మిగతా కథాంశం.
1990లో “కొదమ సింహం” కైకాల నాగేశ్వర్ రావు ఈ మూవీని నిర్మించగా.. దర్శకుడు మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఇందులో రాధ, వాణీ విశ్వనాథ్ లతోపాటు సోనమ్ అనే హిందీ నటి కూడా యాక్ట్ చేసింది. అలాగే కైకాల సత్యనారాయణ, మోహన్బాబు, గొళ్లపూడి, కన్నడ ప్రభాకర్, ప్రాణ్ (హిందీ) లు ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఇందులో హార్స్ రైడింగ్ కోసం చిరంజీవి అప్పట్లో రాజస్థాన్లో గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. 1989 సెప్టెంబర్ 21న ప్రారంభమైన షూటింగ్ సుదీర్ఘంగా సాగింది. ఈ మూవీలో మెగాస్టార్తో ప్రభుదేవా స్టెప్పులేయించారు. రాజ్ కోటి సంగీతం అందించారు. ఈ క్రమంలోనే మూవీలోని పిల్లో జాబిల్లో.., ఘుం ఘుమాయించు కొంచెం.., చక్కిలి గింతల రాగం.., జపం జపం కొంగ జపం.. అనే పాటలు బంపర్ హిట్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ పాటలనే వినేవారు. ఆ క్రమంలో ఈ మూవీ షూటింగ్ను ఎట్టకేలకు పూర్తి చేశారు. 1990, జూలైలో ఆడియో విడుదల కాగా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. 1990, ఆగస్టు 9వ తేదీన మూవీ విడుదలైంది. పాటలు, ఫైట్లు అద్భుతంగా కుదిరాయి. అయితే 1990 సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి వరుసగా ఈ మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో విజయ దుందుభి మోగించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…