ఎమ్మేల్యే రోజాపై విమర్శల వర్షం.. మంచి పనికి వెళ్లినా తప్పని తిప్పలు.. ఏమైందంటే..!

ఆర్కే రోజా అంటే.. నగిరి ఎమ్మెల్యేగా కంటే కూడా చాలామందికి హీరోయిన్ గా.. బబర్దస్త్ జడ్డిగా చాలామందికి సుపరిచితం. ఆమెను వైయస్సార్సీపి పార్టీ ఫైర్ బ్రండ్ గా కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. దానికి భారత రాష్ట్రపతి కూడా అతీతం కాదు. మూతికి మాస్స్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలి.

కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అయితే దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసకుంటున్నారు. కానీ ఇంకా 18 ఏళ్ల లోపు పిల్లలకు మొదలవ్వలేదు. పాఠశాలలో ఉండే పిల్లల దగ్గర ఎవరైనా నిబంధనలకు లోబడి బోధన లేదా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే రోజా దానికి విరుద్ధంగా ప్రవర్తించారు.

చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరులో 27.83 లక్షల రూపాయల వ్యయంతో ‘నాడు నేడు’ పథకం కింద ఆధునికరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనమును ఆమె ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు ఉన్న తరగతి గదికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. అక్కడ టీచర్ అవతారం ఎత్తారు. కాసేపు వాళ్లకు బోధించారు కూడా. అయితే ఈ సమయంలోనే ఆమె ఫేస్ కు మాస్క్ ధరింలేదు. అంతేకాకుండా.. ఆమె పక్కన ఉన్నవారు కూడా ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు.

భౌతికదూరం అస్సలు లేనే లేదు. దీంతో ఆమెపై ప్రతిపక్షపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా తీసుకోని పిల్లల వద్ద మాస్క్ లు లేకుండా ఎలా తిరుగుతారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నాయకులు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మినహాయిపు ఇచ్చారా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోవిడ్ ప్రమాణాలు పాటించని ఆ పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.