ఆర్కే రోజా అంటే.. నగిరి ఎమ్మెల్యేగా కంటే కూడా చాలామందికి హీరోయిన్ గా.. బబర్దస్త్ జడ్డిగా చాలామందికి సుపరిచితం. ఆమెను వైయస్సార్సీపి పార్టీ ఫైర్ బ్రండ్ గా కూడా పిలుస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. నిబంధనలు ప్రతీ ఒక్కరూ పాటించాలి. దానికి భారత రాష్ట్రపతి కూడా అతీతం కాదు. మూతికి మాస్స్ ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలి.
కరోనా బారి నుంచి తప్పించుకోవాలంటూ వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అయితే దాదాపు అందరూ వ్యాక్సిన్ తీసకుంటున్నారు. కానీ ఇంకా 18 ఏళ్ల లోపు పిల్లలకు మొదలవ్వలేదు. పాఠశాలలో ఉండే పిల్లల దగ్గర ఎవరైనా నిబంధనలకు లోబడి బోధన లేదా ఉపన్యాసాలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే రోజా దానికి విరుద్ధంగా ప్రవర్తించారు.
చిత్తూరు జిల్లా నిండ్ర మండలం అత్తూరులో 27.83 లక్షల రూపాయల వ్యయంతో ‘నాడు నేడు’ పథకం కింద ఆధునికరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనమును ఆమె ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు ఉన్న తరగతి గదికి వెళ్లి వారితో కాసేపు ముచ్చటించారు. అక్కడ టీచర్ అవతారం ఎత్తారు. కాసేపు వాళ్లకు బోధించారు కూడా. అయితే ఈ సమయంలోనే ఆమె ఫేస్ కు మాస్క్ ధరింలేదు. అంతేకాకుండా.. ఆమె పక్కన ఉన్నవారు కూడా ఒక్కరు కూడా మాస్క్ ధరించలేదు.
భౌతికదూరం అస్సలు లేనే లేదు. దీంతో ఆమెపై ప్రతిపక్షపార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ కూడా తీసుకోని పిల్లల వద్ద మాస్క్ లు లేకుండా ఎలా తిరుగుతారు అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు నాయకులు. పాఠశాలలో కోవిడ్ నిబంధనలు మినహాయిపు ఇచ్చారా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కోవిడ్ ప్రమాణాలు పాటించని ఆ పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…