Naga Chaitanya: ఆ సంఘటన చాలా బాధ పెట్టింది… అప్పటినుంచి థియేటర్ కు వెళ్లడం మానేశా: నాగచైతన్య

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇకపోతే ఆయన థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తనకు థియేటర్ సెంటిమెంట్ అని అందుకే తాను థియేటర్లో సినిమా చూడడానికి ఇష్టపడనని చెప్పిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే లాల్ సింగ్ చద్దా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయం గురించి నాగచైతన్య క్లారిటీ ఇచ్చారు. అసలు తాను థియేటర్ కి వెళ్లి సినిమా చూడకపోవడానికి ఒక కారణం ఉందని గతంలో జరిగిన ఒక విషయాన్ని బయట పెట్టారు.

తాను మొట్టమొదటిసారిగా నటించిన జోష్ సినిమా విడుదలైన మొదటి రోజు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉందో చూడటం కోసం థియేటర్ కు వెళ్లారట.ఇలా ప్రేక్షకుల మధ్యలో కూర్చుని సినిమా చూస్తున్న నాగచైతన్య ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ మొదలయ్యే సరికి జనాలు థియేటర్ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్లడం తనని ఎంతో బాధ పెట్టిందని ఆ సంఘటన ఇప్పటికి తనకు తన మైండ్ నుంచి తొలగిపోలేదని తెలిపారు.

Naga Chaitanya: నా మైండ్ లో ఇప్పటికీ ఆ ఘటన మెదులుతుంది…

ఈ విధంగా ప్రేక్షకులు ఒక్కొక్కరుగా థియేటర్ నుంచి వెళ్లిపోవడంతో తనకు చాలా బాధ కలిగిందని ఆ క్షణమే ఇకపై థియేటర్లో సినిమా చూడకూడదని నిర్ణయించుకున్నానని నాగచైతన్య వెల్లడించారు. ఆ రోజు నుంచి ఇప్పటివరకు తాను థియేటర్ కి వెళ్లి సినిమా చూడలేదని ఈ సందర్భంగా నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.