Nagababu: గరికపాటి వివాదానికి చెక్ పెట్టిన నాగబాబు.. ఆయనతో క్షమాపణలు చెప్పించుకోవడం మా కోరిక కాదంటూ ట్వీట్!

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా గరికపాటిన ఉద్దేశించి చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు అలయ్ బలయ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి పట్ల ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.ఈ క్రమంలోనే గరికపాటి నరసింహారావు పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయంపై నాగబాబు పరోక్షంగా ట్వీట్ చేస్తూ ఏ పాటి వాడికైనా మెగాస్టార్ చిరంజీవినీ చూస్తే అసూయ పడటం పరిపాటే అంటూ ట్వీట్ చేయగా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే మెగా అభిమానుల సైతం రెచ్చిపోతూ గరికపాటి పై పెద్ద ఎత్తున విమర్శలు చేయడమే కాకుండా ఆయన క్షమాపణలు చెప్పాలనీ డిమాండ్ వ్యక్తం చేశారు.

ఇకపోతే తాజాగా నాగబాబు ట్విట్టర్ వేదికగా మరొక ట్వీట్ చేస్తూ ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గరికపాటి వారు ఏదో మూడ్ లో అలా అని ఉండుంటారు.అతనులాంటి ఓ గొప్ప పండితుడు అలా మాట్లాడుకూడదని తనకు అర్థం వచ్చేలా అన్నామే తప్ప ఆయన క్షమాపణలు చెప్పాలని మేము కోరుకోలేదు. ఏది ఏమైనా మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలని కానీ ఆయనని ఎవరు తప్పు పట్టవద్దు ఇది నా రిక్వెస్ట్ అంటూ నాగబాబు ట్విట్టర్ వేదికగా మరొక త్వీట్ చేశారు.

Nagababu: ఆయన ఏదో మూడ్ లో అలా అని ఉంటారు..

ఈ విధంగా నాగబాబు గరికపాటి గురించి ఇలాంటి ట్వీట్ చేస్తూ ఈ వివాదానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే గరికపాటి కూడా ఈ విషయంపై స్పందించి మెగాస్టార్ చిరంజీవి గారితో స్వయంగా తాను మాట్లాడతానని తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇలా నాగబాబు ఈ విషయంపై స్పందించే ట్వీట్ చేయడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడినట్లు తెలుస్తోంది.