Nagarjuna – Amala:ఈ ఏడాది దసరా పండుగను సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా దసరా పండుగ సందర్భంగా తెలుగులో కూడా సినిమాలు విడుదలవడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకున్నారు. ఇక నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా విడుదలయి మంచి హిట్ కావడంతో నాగార్జున కుటుంబ సభ్యులు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దసరా పండుగ సందర్భంగా నాగార్జున దంపతులు బాలీవుడ్ సెలబ్రిటీలతో కలిసి దసరా వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా నాగార్జున బాలీవుడ్ తారలతో కలిసి దసరా వేడుకలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…
నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ సమస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నాగార్జున కళ్యాణ్ జువెలర్స్ కు కేవలం తెలుగులో మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇక ఈ బ్రాండ్ కు వివిధ భాషలలో ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నటువంటి సెలెబ్రెటీల అందరిని ఒకే చోట చేర్చి దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ క్రమంలోనే నాగార్జున అమలతో పాటు రణబీర్ కపూర్, స్నేహ, కత్రినా కైఫ్,కళ్యాణి ప్రియదర్శన్ వంటి పలువురు సెలబ్రిటీలు ఒకే చోటచేరి దసరా వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక నాగార్జున సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన ది ఘోస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అఖిల్ తో కలిసి భారీ మల్టీ స్టారర్ సినిమా చేయనున్నట్లు నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…