Nagarjuna: అర్ధరాత్రి ఫోన్ వస్తే నాగార్జున అంతలా భయపడతారా.. ఎందుకంత భయం?

Nagarjuna: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నాగార్జున ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇటీవల ఈయన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నా సామిరంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే నాగార్జున గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జునకు ఇండస్ట్రీలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారని అలాంటి వారిలో హీరోయిన్ టబు కూడా ఒకరిని చెప్పాలి.

వీరిద్దరి మధ్య చాలా మంచి సాన్నిహిత్యం ఉండడంతో అది ప్రేమని త్వరలోనే నాగార్జున ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నాగార్జున స్వయంగా స్పందించి ఖండించారు. తను నాకు చాలా మంచి స్నేహితురాలని టబు ఎప్పుడు హైదరాబాద్ వచ్చిన తను మా ఇంట్లోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

టబు ఫోన్ చేస్తే అంత భయమా..
ఇలా వీరిద్దరి గురించి నాగార్జున ఇంత క్లారిటీ ఇచ్చినప్పటికి వీరి గురించి రూమర్స్ రావడం సర్వసాధారణం అయితే తాజాగా టబు నుంచి అర్ధరాత్రి సమయంలో నాగార్జునకు ఫోన్ కాల్ వచ్చింది అంటే మాత్రం ఈయనకు వెన్నులో వణుకు పుడుతుందట. ఈమె అర్థరాత్రి నాగార్జునకు కనుక ఫోన్ చేసింది అంటే తప్పకుండా ఆమె ఎవరితోనో గొడవ పడిందని, ఆ గొడవ గురించి తనకు చెప్పడానికే ఫోన్ చేసిందని నాగార్జున ఫిక్స్ అయితారట. అందుకే తన నుంచి ఫోన్ రాగానే ఎలాంటి గొడవ సృష్టించిందోనని నాగార్జున భయపడిపోతారు తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.