Namratha Shirodkar: మళ్ళీ సినిమాల్లోకి నమ్రత.. ఫోటోషూట్లతో ఫ్యాన్స్ లో అనుమానాలు… క్లారిటీ ఇచ్చిన సూపర్ స్టార్ భార్య…!

Namratha Shirodkar : నమ్రత శిరోద్కర్ ఫెమినా మిస్ ఇండియా గా మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి బాలీవుడ్ సినిమాలతో బిజీ అయినా ఆ తరువాత తెలుగులో మహేష్ బాబు తో కలిసి వంశీ, చిరంజీవితో కలిసి అంజి సినిమాలో నటించింది. ఇక మహేష్ బాబు తో చేసిన వంశీ సినిమా టైములోనే ప్రేమలో పడ్డారు. 2005 లో మహేష్ బాబుతో వివాహం జరిగాక నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు. తన కుటుంబ బాధ్యతలతో బిజీ అయ్యారు. పిల్లలు పుట్టాక తల్లిగా భార్యగా మరింత భాద్యతలు పెరిగాయి. ఇక అటు మహేష్ సినిమాలకు సంబంధించిన పనులతో పాటు, జీఏంబి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు భాద్యతలను చూసుకుంటున్నారు.

సినిమాల్లోకి రీ ఎంట్రీ…..

సినిమాల్లో కనిపించక పోయినా నమ్రత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మహేష్ తో కలిసి చేసారు. ఇక తరచూ ఫ్యామిలీ తో కలిసి ఫోటోషూట్స్ లో పాల్గొంటుంటారు. ఇటీవల తన సన్నిహితుల స్టైలింగ్ షాప్ ఓపెనింగ్ కి అతిధిగా వచ్చిన నమ్రత తన సినిమా రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య ఫోటో షూట్లు, సోషల్ మీడియాలో ఫొటోలతో యాక్టివ్ గా ఉండటంతో చాలా మంది మళ్ళీ సినిమాలోకి నమ్రత రీ ఎంట్రీ ఇస్తారు అని భావిస్తున్న నేపథ్యంలో నమ్రత స్పందించడం ఆసక్తిని రేపింది.

సినిమాల్లోకి రావలన్న ఆసక్తి లేదని ప్రస్తుతం తన కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్నానని, తన కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడుతానని. ఇపుడే కాదు భవిష్యత్తులో కూడా సినిమాల్లో మళ్ళీ నటించే ఉదేశ్యం లేదని, ఈ విషయం కొంతమంది అభిమానులను హర్ట్ చేయొచ్చు కానీ సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పేసింది. దీంతో ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారని ఆశపడిన అభిమానులు నిరాశ పడ్డారు.