Namratha Shirodkar : నమ్రత శిరోద్కర్ ఫెమినా మిస్ ఇండియా గా మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసి బాలీవుడ్ సినిమాలతో బిజీ అయినా ఆ తరువాత తెలుగులో మహేష్ బాబు తో కలిసి వంశీ, చిరంజీవితో కలిసి అంజి సినిమాలో నటించింది. ఇక మహేష్ బాబు తో చేసిన వంశీ సినిమా టైములోనే ప్రేమలో పడ్డారు. 2005 లో మహేష్ బాబుతో వివాహం జరిగాక నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పారు. తన కుటుంబ బాధ్యతలతో బిజీ అయ్యారు. పిల్లలు పుట్టాక తల్లిగా భార్యగా మరింత భాద్యతలు పెరిగాయి. ఇక అటు మహేష్ సినిమాలకు సంబంధించిన పనులతో పాటు, జీఏంబి ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థలు భాద్యతలను చూసుకుంటున్నారు.
సినిమాల్లోకి రీ ఎంట్రీ…..
సినిమాల్లో కనిపించక పోయినా నమ్రత కొన్ని కమర్షియల్ యాడ్స్ లో మహేష్ తో కలిసి చేసారు. ఇక తరచూ ఫ్యామిలీ తో కలిసి ఫోటోషూట్స్ లో పాల్గొంటుంటారు. ఇటీవల తన సన్నిహితుల స్టైలింగ్ షాప్ ఓపెనింగ్ కి అతిధిగా వచ్చిన నమ్రత తన సినిమా రీ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్య ఫోటో షూట్లు, సోషల్ మీడియాలో ఫొటోలతో యాక్టివ్ గా ఉండటంతో చాలా మంది మళ్ళీ సినిమాలోకి నమ్రత రీ ఎంట్రీ ఇస్తారు అని భావిస్తున్న నేపథ్యంలో నమ్రత స్పందించడం ఆసక్తిని రేపింది.
సినిమాల్లోకి రావలన్న ఆసక్తి లేదని ప్రస్తుతం తన కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్నానని, తన కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడుతానని. ఇపుడే కాదు భవిష్యత్తులో కూడా సినిమాల్లో మళ్ళీ నటించే ఉదేశ్యం లేదని, ఈ విషయం కొంతమంది అభిమానులను హర్ట్ చేయొచ్చు కానీ సినిమాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పేసింది. దీంతో ఆమె మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తారని ఆశపడిన అభిమానులు నిరాశ పడ్డారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…