సాధారణంగా ఏ రంగంలో పని చేసేవారు వారి వారసులను కూడా అదే రంగంలోకి తీసుకువెళ్లాలని భావిస్తారు. ఈ క్రమంలోనే క్రీడా రంగంలో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలను కూడా అదే రంగంలోకి తీసుకువెళ్తారు. రాజకీయాలలో ఉన్న వారు రాజకీయ రంగంలోకి, సినిమా రంగంలో ఉన్న వారు సినిమా రంగంలోకి వారి వారసులను తీసుకు వస్తారు. కానీ రాజకీయ రంగంలో ఉన్నవారు సినిమా రంగం వైపు రావడం చాలా తక్కువ.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ్ హీరోగా సినిమా రంగం వైపు వచ్చారు. అలాగే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని భావించారు. అందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు.
అప్పట్లో నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన “జయం” సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే తేజ దర్శకత్వంలో ఒక ప్రేమ కథ చిత్రం ద్వారా నారా లోకేష్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు.అయితే లోకేష్ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తే భవిష్యత్తులో రాజకీయ వారసత్వంపై దెబ్బ పడే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించారేమో కానీ లోకేష్ మాత్రం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేకపోయారు.
ఈ క్రమంలోనే అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తన మొట్టమొదటి సినిమా “నిన్ను చూడాలని” సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కు చెక్ పెట్టడం కోసమే నారా లోకేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు గానీ నారా లోకేష్ మాత్రం ఇండస్ట్రీలోకి రాలేకపోయారు. అయితే నారా లోకేష్ హీరోగా ఒక సినిమాను మిస్ చేసుకున్నారంటూ అప్పట్లో సినీ సపరివార పత్రిక సంతోషం ప్రారంభ సంచిక లో మొదటి పేజీ పై ప్రచురించడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు స్పందించి సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప స్టార్ ని కోల్పోయిందంటూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…