Natti Kumar : చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్న వాళ్ళే… దేవుడు అని భజన చేసిన వాళ్ళే… బండబూతులు తిడుతున్నారు… వెన్నుపోటు పొడిచారు…: నట్టికుమార్

Nattikumar : ఏపీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ నేతలకు అలానే జనసేన పార్టీ నేతలకు మధ్య మాటల వార్ బాగా జరుగుతుంది. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మంత్రి రోజా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటే ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి జనసేన పార్టీ జబర్దస్త్ హైపర్ ఆదిని రంగంలోకి దించారు. ఇక రోజా పంచులకు రివర్స్ పంచులు వేస్తూ ఆది జనసేన అభిమానులకు బూస్ట్ అప్ ఇచ్చాడు. అయితే ఆదిని వాడుకుంటోంది మెగా ఫ్యామిలీ అంటూ రోజా మరోసారి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాల మీద నిర్మాత నట్టికుమార్ మాట్లాడారు.

ఒకప్పుడు దేవుడంటూ భజన చేసిన వారే నేడు బండబూతులు తిడుతున్నారు…

నట్టి కుమార్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ విమర్శలు రాజకీయాల వరకే పరిమితమైతే బాగుంటుందంటూ మాట్లాడారు. వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయాల్లో లేనివారిని విమర్శించడం బాగోలేదంటూ చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి అందరూ భయపడాలి, బెదిరించి పనులు చేయించుకుంటారు అన్న విమర్శలను రోజా చేయడం తగదు అంటూ నట్టి అభిప్రాయపడ్డారు. రోజా కూడా చిరంజీవి గారితో నటించారు, నాగబాబుతో కలిసి పనిచేసారు అలా మాట్లాడటం ఎందుకు రాజకీయంగా ఏవైనా మాట్లాడొచ్చు కాని ఇలా వ్యక్తిగతం ఎందుకు అంటూ అభిప్రాయపడ్డారు.

ఒకప్పుడు మెగా ఫ్యామిలీ భజన చేసి వాళ్ళ కాళ్ళు నొక్కిన వాళ్ళు నేడు ఇతర పార్టీకి వెళ్లి బండ బూతులు తిడుతున్నారంటూ మాట్లాడారు. మరికొంతమంది నువ్వే నా దేవుడు అంటూ పవన్ కళ్యణ్ కాళ్ళ దగ్గర ఉండేవారు ఇప్పుడు నీకు పోటీగా నిలబడతా అంటూ మాట్లాడుతున్నారు. మెగా ఫ్యామిలీకి ఎంతో మంది వెన్నుపోటు పొడిచారు. మెగాఫ్యామిలీ ద్వారా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న చాలా మంది నేడు వారికంటే గొప్పవారు అన్నట్లు మాట్లాడుతున్నారు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.