Nayanathara-Vignesh Shivan: చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార నాలుగు నెలల క్రితం విగ్నేష్ శివన్ అనే తమిళ దర్శకున్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
వీరి వివాహం జరిగినప్పటి నుండి ఇద్దరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా సరోగసి పద్ధతి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ దంపతులపై తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు వ్యతిరేకంగా నయనతార దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే ఇలా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనివ్వడంతో తీవ్రదుమారం రేపుతుంది.
విచారణలో భాగంగా తమకి ఆరు సంవత్సరాల క్రితమే పెళ్లి అయినట్లు దంపతులు ప్రభుత్వానికి తెలియజేశారు. అంతేకాకుండా ఏడాది క్రితమే సరోగసి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కూడా వెల్లడించారు.
అయితే నయన్ విగ్నేష్ రిజిస్ట్రేషన్ పెళ్లికి సంబంధించిన ఆధారాలతో పాటు ఏడాది క్రితం సరోగసి కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆధారాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
Nayanathara-Vignesh Shivan: ఆధారాలు సమర్పించని నయన్ దంపతులు…
ప్రస్తుతం ఈ ఆధారాలు సంపాదించే పనిలో నయన్ దంపతులు ఉన్నారు. అయితే ఈ విషయంలో నయన్ దంపతులు ప్రభుత్వానికి ఆధారాలు సమర్పించలేదని… ఈ విషయంలో వీరిద్దరితో పాటు సరోగసికి సహకరించిన మరో వ్యక్తికి కూడా జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదం నుండి నయనతార దంపతులు ఎలా బయటపడతారో చూడాలి మరి.