Nayanathara -Vignesh Shivan: పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన నయనతార దంపతులు.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Nayanathara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈమె గత కొన్ని సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా వీరి వివాహం జరిగి నాలుగు నెలలు అయింది.

ఈ విధంగా వివాహం జరిగిన తర్వాత ఈ జంట వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ పలు విదేశీ పర్యటనలలో ఉంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.ఇకపోతే వీరి గురించి అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని విగ్నేష్ తాజాగా ఈ దంపతులు ఇద్దరు మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని సోషల్ మీడియా వేదికగా పిల్లలను ముద్దాడుతూ ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు.

ఈ సందర్భంగా నయనతార విగ్నేష్ ఇద్దరు తమ పిల్లల పాదాలను ముద్దు పెడుతూ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ… భగవంతుడి ఆశీస్సులు, పూర్వీకుల ఆశీర్వాదంతో తామిద్దరం ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని మా పిల్లలపై మీ ప్రేమ ఆశీర్వాదాలు కూడా ఉండాలంటూ ఈయన పిల్లల ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ అయ్యారు.

Nayanathara -Vignesh Shivan: సరోగసి పద్ధతి ద్వారా తల్లి అయిన నయన్..

వీరిద్దరికి వివాహం జరిగి నాలుగు నెలలు కూడా పూర్తికాకుండానే పిల్లలకు జన్మనివ్వడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట పెళ్లికి ముందే పిల్లలను సరోగసి పద్ధతి ద్వారా కనాలని నిర్ణయం తీసుకొని ముందే ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది.ఇలా పెళ్లికి ముందే సరోగసి ప్లాన్ చేసినటువంటి ఈ దంపతులు తాజాగా కవల మగ పిల్లలకు తల్లిదండ్రులు అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నయనతార దంపతులు తల్లిదండ్రులు కావడంతో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు, అభిమానులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.