Anantha Sriram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ గేయ రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అనంత శ్రీరామ్. ఈయన ఎన్నో అద్భుతమైన పాటలను ప్రేక్షకులకు అందించారని చెప్పాలి. ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ చేసిన వాక్యాలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ…రామాయణంలో రాముడు, సీతాదేవిని గాయపర్చిన కాకిపైకి గరికెను బ్రహ్మాస్త్రంగా సంధిస్తాడు. రాముడు ఈ విధంగా ఆ గరికను పట్టుకోవడం వల్ల గరిక విలువ ఎంతో పెరిగింది కానీ తగ్గలేదు. గరిక ఈ విషయాన్ని వినయంతో ఒప్పుకోవాలి తప్ప అహంకారం ప్రదర్శించకూడదని అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా గరిక గురించి అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈయన పరోక్షంగా గరికపాటిని ఉద్దేశించి చేశారంటూ మరో వాదన తెరపైకి వచ్చింది.ఈ విధంగా అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనంత శ్రీరామ్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను గరిక గురించి చేస్తున్న వ్యాఖ్యలు యాదృచ్ఛికంగా చేశాను అని చెప్పడం అబద్ధం అవుతుంది… ఉద్దేశపూర్వకంగానే తాను గరిక గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశానని ఆయన వెల్లడించారు.అయితే ఆయన గరిక గురించి చెప్పారా లేదా గరికపాటి గురించి ఈ వ్యాఖ్యలు చెప్పారా అనే విషయంపై ఇంటర్వ్యూ సందర్భంగా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఏది ఏమైనా ఈయన పరోక్షంగానే గరికపాటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…