మరోసారి ప్రియుడికి దూరమైన నయనతార.. కారణం అదే!

నయనతార అంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఒక బ్రాండ్ అని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇటు తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న నయనతార తన ప్రేమ విషయంలో ఎన్నోసార్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నయనతార ప్రస్తుతం తమిళ నటుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. తమిళనాడులో వీరిద్దరూ కలిసి ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారనే ప్రచారం కూడా సాగింది.అంతే కాకుండా వీరిద్దరు ఒకే ఇంట్లో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అయితే ప్రస్తుతం నయనతార తమిళ, మలయాళ చిత్రాలలో భాగంగా హైదరాబాద్ లో రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటున్నారు. కొద్ది రోజుల పాటు షూటింగ్ ఇక్కడే ఉండటంతో నయనతార రామోజీ ఫిలిం సిటీలోనే ఉంటున్నారు. అయితే తన ప్రియుడు విగ్నేష్ శివన్ కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పటికీ తన ప్రియుడుకు నయనతార దూరంగా ఉంటున్నారు. ఇలా ఇద్దరూ ఒకే చోట ఉన్న దూరంగా ఉండటానికి గల కారణం ఏమిటంటే ప్రస్తుతం నయనతార, రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న  ‘అన్నత్తే’ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.

అలాగే విగ్నేష్ శివన్ రామోజీ ఫిలిం సిటీలో విజయ్ సేతుపతి, సమంత జంటగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ విధంగా రెండు చిత్రాల షూటింగ్ పనులు ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతుండడంతో ఒక సినిమాకు సంబంధించిన బృందం, మరొక సినిమా టీంతో మాట్లాడకూడదననే షరతు ఉండటం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. ఈ విధంగా తన ప్రియుడు విగ్నేష్ శివన్ పక్కనే ఉన్నా కూడా నయనతార డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితిలో లేదని చెప్పవచ్చు.