Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా 20 సంవత్సరాల నుంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అందరికంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ అందుకొని సౌత్ ఇండియన్ స్టార్ యాక్టర్స్ గా నయనతార పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.
ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే జవాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
ఇక ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా జన్మించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఎప్పుడైతే నయనతార తన భర్తను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
విడాకుల దిశగా అడుగులు..
ఇదిలా ఉండగా తాజాగా నయనతార తన భర్త పేరుపై ఉన్నటువంటి ఆస్తులను మొత్తం తిరిగి తన పేరు మీద రాయించుకుందని తెలుస్తుంది. తన భర్త తన సర్వస్వం అంటూ ఈమె సినిమాలలో సంపాదించినది మొత్తం తన భర్త పేరు మీదగా ట్రాన్స్ఫర్ చేశారట అయితే ఉన్నఫలంగా ఈమె ఆస్తులు అన్నింటిని కూడా తన పేరు మీద రాయించుకున్నారని తెలుస్తోంది. ఈ విషయం కాస్త వైరల్ గా మారడంతో ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరుగుతున్నాయా వీరు కూడా విడాకులు దిశగా అడుగులు వేస్తున్నారా వీరి జీవితంలో వేణు స్వామి చెప్పినది నిజం అవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…