Mudragada: జన సేన నాయకులే నా కూతురితో నన్ను తిట్టించారు.. కూతురు వ్యాఖ్యలపై ముద్రగడ కామెంట్స్!

Mudragada: ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలు ఒకసారిగా మార్పు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సిపి పార్టీలోకి వెళ్లిన తర్వాత కొందరు జనసేన నాయకులు తనని టార్గెట్ చేశారు. ముద్రగడ పద్మనాభం గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేశారు.ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి కూడా తనకు ఎదురు తిరిగారు.

ఇటీవల ఆమె ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. మా నాన్నలు కేవలం వైసిపి పవన్ కళ్యాణ్ ని తిట్టడం కోసమే పెట్టుకున్నారని ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాన్నను ఎటు కాకుండా పెట్టేస్తారని ఈమె తెలిపారు. ఈ విషయంలో మా నాన్న తీరు నాకు నచ్చలేదని తాను పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ ఆయన గెలుపు కోసమే కష్టపడతానని క్రాంతి వెల్లడించారు.

ఈ విధంగా తన తండ్రికి వ్యతిరేకంగా క్రాంతి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పై ముద్రగడ పద్మనాభం స్పందించారు. తన కుమార్తె క్రాంతి చేత జనసేన నాయకులే నన్ను తిట్టించారని ఈయన తెలియజేశారు. ఇక నా కూతురు ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు పెళ్లి కానంత వరకు ఆమె నా ప్రాపర్టీ ఇప్పుడు ఆమె అత్తగారి ప్రాపర్టీ అని తెలిపారు.

అధికారం అనే ఆకలి ..
పవన్ కళ్యాణ్ కేవలం పదవి కోసమే పిఠాపురం వచ్చారని, ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఆయన హైదరాబాద్ కి పరిమితమవుతారని ముద్రగడ తెలిపారు. చంద్రబాబు నాయుడు అధికారం అనే ఆకలి తీర్చుకోవడం కోసమే తాపత్రయపడుతున్నారు అంటూ ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం తన కూతురు కామెంట్లపై స్పందిస్తూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.