మరోసారి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ సినిమా..!

సాధారణంగా దర్శకులు సినిమాను తెరకెక్కించిన అప్పుడు కొన్ని ఫ్లాప్ అవుతాయి కొన్ని హిట్ అవుతాయి. పలువురు దర్శకులకు అయితే వరుసగా వారి తెరకెక్కించిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలాంటివారికి తెలుగు సినీ ఇండస్ట్రీలో గీతాఆర్ట్స్ మంచి ఆప్షన్ అంటూ ఉంటారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది యువ దర్శకులు ఇలా గీతా ఆర్ట్స్ కు వచ్చి మళ్లీ మంచి హిట్ ట్రాక్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు.

అలాంటివారిలో పరశురామ్ కూడా ఒకరు. గోవిందం సినిమా తో సూపర్ హిట్ ను అందుకునీ మహేష్ బాబు తో సినిమా తీసే అవకాశాన్ని కొట్టేశారు. బొమ్మరిల్లు భాస్కర్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ తన తర్వాత సినిమా కూడా గీతాఆర్ట్స్ లోనే చేస్తాడు అంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

గీతా ఆర్ట్స్ నుంచి ఉదయం హీరో కోసం కథ సిద్ధం చేసుకో అని బొమ్మరిల్లు భాస్కర్ కి ఇటీవల పిలుపు వచ్చిందట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విజయంతో భాస్కర్ ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడింది.అయితే ఈ సారి కూడా గీతా ఆర్ట్స్ లో ఉండి చేస్తాడా లేక? కథ సిద్ధం చేసుకొని సినిమా చేస్తాడా అనేది తెలియాలి మరి. భాస్కర్ తన తరువాత చిత్రం ఎవరితో చేస్తాడు అన్నా విజయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

గీతా ఆర్ట్స్ వద్ద రెండు యువ హీరోల డేట్లు ఉన్నాయి.ఇక అందులో కార్తికేయ, విజయ్ దేవరకొండ అలాగే నిఖిల్ వంటి వారు కూడా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శిరీష్ కెరియర్ కూడా బిల్డ్ చేయాల్సి ఉంది. అయితే భాస్కర్ సిద్ధం చేస్తున్న కథ ఆ యువ హీరోల కోసమా లేక శిరీష్ కోసమా అన్న విషయం ఇంకా తెలియలేదు. ఈ విషయం గురించి మరింత సమాచారం తెలియాలి అంటే అధికారంకంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి.