సీనియర్ నటుడు,కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ ప్రస్థానంలో 183 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పట్లో జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, మన ఊరి పాండవులు ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి.
మొదట చిలకా గోరింక సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అరంగ్రేటం చేశారు. ఆ తర్వాత మూడు సార్లు నంది అవార్డులు ఐదు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు కృష్ణంరాజు. ఒకవైపు వెండితెరపై నటుడిగా అలరిస్తూనే మరొకవైపు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సేవలను అందించారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కృష్ణంరాజు తన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి చేత కేక్ కటింగ్ చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పని మనిషి ఏంటి కేక్ కటింగ్ చేయించడమేంటి అని అనుకుంటున్నారా! రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంట్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు, కుటుంబం ఆమెను ఘనంగా సన్మానించారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె కేక్ కట్ చేయించారు. సంబంధించిన ఫోటోలు కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు థాంక్యూ పద్మా ఆంటీ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆమెకు ఒక బంగారు గొలుసులు కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…