సీనియర్ నటుడు,కేంద్ర మాజీమంత్రి కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన సినీ ప్రస్థానంలో 183 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసులలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అప్పట్లో జీవన తరంగాలు, కృష్ణవేణి, భక్త కన్నప్ప, అమరదీపం, మన ఊరి పాండవులు ఇలా ఎన్నో సినిమాలు ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టాయి.
మొదట చిలకా గోరింక సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి అరంగ్రేటం చేశారు. ఆ తర్వాత మూడు సార్లు నంది అవార్డులు ఐదు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు కృష్ణంరాజు. ఒకవైపు వెండితెరపై నటుడిగా అలరిస్తూనే మరొకవైపు రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సేవలను అందించారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో కృష్ణంరాజు తన ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి చేత కేక్ కటింగ్ చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పని మనిషి ఏంటి కేక్ కటింగ్ చేయించడమేంటి అని అనుకుంటున్నారా! రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంట్లో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న పద్మ అనే మహిళను కృష్ణంరాజు, కుటుంబం ఆమెను ఘనంగా సన్మానించారు. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె కేక్ కట్ చేయించారు. సంబంధించిన ఫోటోలు కృష్ణంరాజు కూతురు ప్రసీద సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
25 ఏళ్లుగా మాకోసం చాలా చేశారు థాంక్యూ పద్మా ఆంటీ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాకుండా ఈ సందర్భంగా కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఆమెకు ఒక బంగారు గొలుసులు కూడా కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో పనిచేసే మహిళను కూడా ఇంట్లో మనిషిగా చేసుకోవడం నిజంగా గ్రేట్ అంటూ కృష్ణంరాజు దంపతులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…