Pallavi prashanth: మరోసారి గొడవపడిన అమర్ పల్లవి ప్రశాంత్… తగ్గేదేలేదంటున్న రైతు బిడ్డ?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అంటూ ఎన్నో రకాల వీడియోల ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈయన తొలిసారి బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విజేతగా నిలబడటంతో ఈయన ఏకంగా సెలబ్రిటీగా మారిపోయారు. అయితే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఈరోజు ఈయన అభిమానులు చూపిన అత్యుత్సాహం కారణంగా పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రెండు రోజులపాటు చంచల్ గూడ జైలులో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా అరెస్టయి బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ ఎక్కడా కూడా కనపడలేదు ఇంటిపట్టునే ఉంటూ తన పనులు తాను చూసుకుంటున్నారు అయితే మొదటిసారి ఈయన మరొక బుల్లితెర కార్యక్రమంలో సందడి చేశారు.

స్టార్ మా వాళ్లు నా సామిరంగా అంటూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కూడా పాల్గొని సందడి చేశారు అయితే ఇక్కడ కూడా శివాజీ గ్రూప్ అలాగే సీరియల్ బ్యాచ్ రెండుగా విడిపోయారు. ఇలా ఈ రెండు గ్రూపులు నాగార్జునను మెప్పించి సంక్రాంతి పండుగకు వారి ఊరికి తీసుకువెళ్లాలి.

నాగార్జున ముందే గొడవ…

ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ మరోసారి అమర్ కు టార్గెట్ చేయడమే కాకుండా బరాబర్ నాగార్జున సర్ మా ఊరికే వస్తారు.. ఈ విషయంలో తగ్గేదే లే అని సవాల్ విసురుతున్నాడు. లేదు మా ఊరికి వస్తాడు అంటూ అమర్ కూడా చెప్పడంతో ఈ విషయంలో వీరిద్దరి మధ్య మరోసారి నాగార్జున ముందే గొడవ జరిగింది అయితే ఇదంతా కూడా షోలో భాగంగానే చేశారని తెలుస్తోంది మొత్తానికి ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ లందరూ కూడా మరోసారి బుల్లితెరపై సందడి చేయబోతున్నారు.