Pavithra Lokesh: వివాదం తర్వాత భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన పవిత్ర లోకేష్.. ఎంతంటే?

Pavithra Lokesh: పవిత్ర లోకేష్ గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.నటుడు నరేష్ తో ఈమె సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలిచారు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఎన్నో తెలుగు సినిమాలలో హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నరేష్ తో వ్యవహారం బయటపడటంతో పెద్ద ఎత్తున ఈమె గురించి నెగెటివిటీ ఏర్పడింది.

పవిత్ర లోకేష్, నరేష్ తో కలిసి పలు సినిమాలలో జోడిగా నటించారు. ఈ క్రమంలోనే నరేష్ తో ఈమె వ్యవహారం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు రావడంతో నరేష్ భార్య రమ్య రఘుపతి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున నరేష్ పవిత్ర గురించి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా వీరిపై చెప్పుతో దాడి చేయడానికి కూడా ఆమె వెనకాడలేదు.

ఈ విధంగా పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకోవడంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోతాయని ఈ ప్రభావం తన కెరియర్ పై పడుతుందని చాలామంది భావించారు. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పవిత్ర లోకేష్ ఏకంగా తన రెమ్యూనరేషన్ పెంచి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఉన్నఫలంగా ఈమె రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Pavithra Lokesh: లక్ష డిమాండ్ చేస్తున్న పవిత్ర…

ఇప్పటివరకు పవిత్ర లోకేష్ ఒక్క రోజుకు 60 వేల రూపాయల పారితోషకం తీసుకునేవారు. అయితే తాజాగా ఈమె లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్క కాల్ షీట్ కు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అంటే భారీ మొత్తమని చెప్పాలి. ఇలా ఒక్కసారిగా ఈమె రెమ్యూనరేషన్ పెంచేసే అందరినీ షాక్ కి గురి చేశారు.