Featured

Sr NTR Family: నందమూరి కుటుంబానికి శాపంగా మారిన ఆగస్టు నెల.. ఆగస్టు కలిసి రాలేదా?

Sr NTR Family: నందమూరి కుటుంబంలో ప్రస్తుతం విషాదం చోటుచేసుకుంది.నందమూరి తారక రామారావు చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈమె అనారోగ్య సమస్యల కారణంగా మానసిక ఆందోళనకు గురై ఇలా ఆత్మహత్యకు పాల్పడిందని వార్తలు వస్తున్నాయి. ఈ విధంగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన మరోసారి బయటకు వచ్చాయి.

సీనియర్ ఎన్టీఆర్ కి నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు సంతానం. అయితే వీరిలో మొదటి కుమారుడు రామకృష్ణ పది సంవత్సరాల వయసులోనే మృతి చెందడంతో తిరిగి తన ఏడవ కుమారుడికి అదే పేరు పెట్టారు. అయితే తన మూడవ సంతానం సాయి కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.ఇకపోతే ఎన్టీఆర్ నాలుగవ కుమారుడు హరికృష్ణ సైతం గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలోనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ సోదరుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.కేవలం ఎన్టీఆర్ కు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కూడా ఆగస్టు నెల కలిసి రాలేదని చెప్పాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఆగస్టు నెలలో రెండు సార్లు ఈ పదవిని కోల్పోయారు. ఇకపోతే 1995 ఆగస్టు నెలలో స్వయంగా చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు జరిగిన వైస్రాయ్ స్కెచ్ కి ఇక ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కాలేదు.

Sr NTR Family: ఎన్టీఆర్ కుటుంబానికి టిడిపి పార్టీకి ఇది శాపమా…

ఇకపోతే తాజాగా ఆగస్టు నెలలోనే మరోసారి ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం అందరిలో విషాదం నింపింది.ఈ విధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన పార్టీకి ఆగస్టు నెల శాపంగా మారిందని, ఈ నెలను ఎన్టీఆర్ ఫ్యామిలీకి అలాగే టిడిపి పార్టీకి బ్యాడ్ సెంటిమెంట్ గా భావిస్తున్నారని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago