Pavithra Lokesh: పవిత్ర లోకేష్ గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.నటుడు నరేష్ తో ఈమె సహజీవనం చేస్తున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా పవిత్ర లోకేష్ వార్తల్లో నిలిచారు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ ఎన్నో తెలుగు సినిమాలలో హీరోలకు హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే నరేష్ తో వ్యవహారం బయటపడటంతో పెద్ద ఎత్తున ఈమె గురించి నెగెటివిటీ ఏర్పడింది.
పవిత్ర లోకేష్, నరేష్ తో కలిసి పలు సినిమాలలో జోడిగా నటించారు. ఈ క్రమంలోనే నరేష్ తో ఈమె వ్యవహారం పెద్ద ఎత్తున చర్చలకు దారి తీసింది. ఇక వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారనే వార్తలు రావడంతో నరేష్ భార్య రమ్య రఘుపతి వివాదంలోకి ఎంట్రీ ఇచ్చి పెద్ద ఎత్తున నరేష్ పవిత్ర గురించి ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా వీరిపై చెప్పుతో దాడి చేయడానికి కూడా ఆమె వెనకాడలేదు.
ఈ విధంగా పవిత్ర లోకేష్ పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకోవడంతో ఈమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోతాయని ఈ ప్రభావం తన కెరియర్ పై పడుతుందని చాలామంది భావించారు. అయితే ఈ వివాదం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పవిత్ర లోకేష్ ఏకంగా తన రెమ్యూనరేషన్ పెంచి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఉన్నఫలంగా ఈమె రెమ్యూనరేషన్ పెంచడంతో నిర్మాతలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు పవిత్ర లోకేష్ ఒక్క రోజుకు 60 వేల రూపాయల పారితోషకం తీసుకునేవారు. అయితే తాజాగా ఈమె లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక్క కాల్ షీట్ కు లక్ష రూపాయల రెమ్యూనరేషన్ అంటే భారీ మొత్తమని చెప్పాలి. ఇలా ఒక్కసారిగా ఈమె రెమ్యూనరేషన్ పెంచేసే అందరినీ షాక్ కి గురి చేశారు.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…