Poojitha : ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు లక్ష్మి పార్వతి ఎంత నటించిందో నేను కళ్ళారా చూసాను ఎవరూ లేనప్పుడు దర్జాగా కూర్చొని టీ తాగేది.. ఆ విషయంలో నాపై కేసు కూడా వేశారు : నటి పూజిత

Poojitha : ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా రెండో హీరోయిన్ గా నటించిన పూజిత ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా రానించలేకపోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన పూజిత ఆ తరువాత సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించలేదు. చాలా రోజుల తరువాత తన భర్త మీద కేసు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన పూజిత, తన భర్త మోసం చేసాడని మళ్ళీ ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఇక ఆ ఆరోపణలతో మళ్ళీ మీడియాలో వైరల్ అయిన పూజిత ఇక పలు ఇంటర్వ్యూల్లో లక్ష్మి పార్వతి గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు.

ఏడ్చినట్టు నటించింది…

ఇక కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నపుడు పూజిత ఎన్టీఆర్ గారు మరణించినపుడు జరిగిన సంఘటనలను తెలిపారు. ఎన్టీఆర్ మరణించిన సమయంలో ఆయనను చివరిసారిగా చూడటానికి వెళ్లగా అక్కడ లక్ష్మి పార్వతి టీ తాగుతూ దర్జాగా కూర్చున్నారు. వెంటనే పీవీ నరసింహ రావు గారు రాగానే పడి పడి ఏడ్చారు, అది చూసాక ఇలా ఎలా చేస్తారనిపించింది.

ఇక ఒక పొలిటికల్ డ్రామా సినిమాలో నటించమని అవకాశం వచ్చినపుడు ఎన్టీఆర్ భార్యగా నన్ను చేయమని అడుగగా నేను లక్ష్మి పార్వతి గారిని అనుకరించాను అందుకు ఆవిడ నామీద కేసు పెట్టారు. అయితే ఆ విషయంలో నాకేం సంబంధం లేదు నేను ఆర్టిస్ట్ ని మాత్రమే ఆమె డబ్బులిచ్చి ఒక సినిమాలో నటించమన్నా నటిస్తాను ఆ కేసుతో నాకు సంబంధం లేదు ఆ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూసుకున్నారు అంటు వివరించింది.