Poojitha : ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడిగా రెండో హీరోయిన్ గా నటించిన పూజిత ఆ తరువాత హీరోయిన్ గా పెద్దగా రానించలేకపోయింది. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించిన పూజిత ఆ తరువాత సినిమాలకు దూరమై ప్రేక్షకులకు కనిపించలేదు. చాలా రోజుల తరువాత తన భర్త మీద కేసు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు వచ్చిన పూజిత, తన భర్త మోసం చేసాడని మళ్ళీ ఒక ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఇక ఆ ఆరోపణలతో మళ్ళీ మీడియాలో వైరల్ అయిన పూజిత ఇక పలు ఇంటర్వ్యూల్లో లక్ష్మి పార్వతి గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు.
ఏడ్చినట్టు నటించింది…
ఇక కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొన్నపుడు పూజిత ఎన్టీఆర్ గారు మరణించినపుడు జరిగిన సంఘటనలను తెలిపారు. ఎన్టీఆర్ మరణించిన సమయంలో ఆయనను చివరిసారిగా చూడటానికి వెళ్లగా అక్కడ లక్ష్మి పార్వతి టీ తాగుతూ దర్జాగా కూర్చున్నారు. వెంటనే పీవీ నరసింహ రావు గారు రాగానే పడి పడి ఏడ్చారు, అది చూసాక ఇలా ఎలా చేస్తారనిపించింది.
ఇక ఒక పొలిటికల్ డ్రామా సినిమాలో నటించమని అవకాశం వచ్చినపుడు ఎన్టీఆర్ భార్యగా నన్ను చేయమని అడుగగా నేను లక్ష్మి పార్వతి గారిని అనుకరించాను అందుకు ఆవిడ నామీద కేసు పెట్టారు. అయితే ఆ విషయంలో నాకేం సంబంధం లేదు నేను ఆర్టిస్ట్ ని మాత్రమే ఆమె డబ్బులిచ్చి ఒక సినిమాలో నటించమన్నా నటిస్తాను ఆ కేసుతో నాకు సంబంధం లేదు ఆ సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూసుకున్నారు అంటు వివరించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…