Priyamani: పెళ్లి సమయంలో చాలా విమర్శలు వచ్చాయి… సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించిన ప్రియమణి!

Priyamani: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియమణి కొంతకాలం కిందట సినిమాలకు దూరమై బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమే తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమాలో ఈమె సీఎం పాత్రలో నటించారు ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ… సోషల్ మీడియా వేదికగా తనను తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. కెరియర్ మొదట్లో తనని బాడీ షేమింగ్ చేశారని తాను కలర్ తక్కువగా ఉన్నానంటూ తన కలర్ గురించి కూడా మాట్లాడారని ఈమె తెలియజేశారు.

ఇకపోతే తాను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తన పెళ్లి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపించారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. తాను ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తమ నిశ్చితార్థపు ఫోటోలు పై చాలా మంది తీవ్ర వ్యతిరేకత చూపించారని ఈమె తెలియజేశారు.

Priyamani:నా జీవితం నా ఇష్టం…

ఇలా మా ఎంగేజ్మెంట్ ఫోటోలపై స్పందించిన కొందరు నువ్వు ఎందుకు ఇలా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అంటూ తనని ప్రశ్నించారని ఈమె తెలిపారు. ఇలా నా గురించి కామెంట్స్ చేసిన వారందరికీ నేను చెప్పేది ఒకటే,ఇది నా జీవితం నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి అనేది పూర్తిగా నా నిర్ణయం అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు. ఇలా అప్పటినుంచి తాను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశానని తెలియజేశారు.