Jabardasth Apparao: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు. ఈ కార్యక్రమంలో కమెడియన్ గా తన డైలాగ్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈయన ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ ఇతర బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉన్నారు.
ఇక ఈ మధ్యకాలంలో అప్పారావు వరుసగా పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన సోషల్ మీడియా గురించి అలాగే యూట్యూబ్ ఛానల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఎన్నో యూట్యూబ్ ఛానల్ పుట్టుకురావడమే కాకుండా సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వెరైటీ థంబ్నెయిల్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పారావు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్స్ వారు వారి ఛానల్ వ్యూస్ కోసం బ్రతికి ఉన్నటువంటి సెలబ్రిటీలను కూడా చంపేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు.
పిచ్చిపిచ్చి థంబ్నెయిల్ పెడుతూ సెలబ్రిటీలు బ్రతికుండగానే వారిని చంపేస్తున్నారని ఇలా ఒక వ్యక్తి బ్రతికుండగానే చనిపోయారు అంటూ చెప్పే హక్కు మీకు లేదని ఈయన తెలిపారు. ఇలాంటి వార్తలు రాయటం వల్ల సెలబ్రిటీలు చాలా మానసికక్షోభకు గురవుతున్నారని, నిజా నిజాలు తెలియకుండా వార్తలు రాయడం సరైన పని కాదంటూ ఈ సందర్భంగా అప్పారావు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…