Priyamani: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రియమణి కొంతకాలం కిందట సినిమాలకు దూరమై బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే ప్రస్తుతం ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమే తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలో ఈమె సీఎం పాత్రలో నటించారు ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ… సోషల్ మీడియా వేదికగా తనను తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారని తెలిపారు. కెరియర్ మొదట్లో తనని బాడీ షేమింగ్ చేశారని తాను కలర్ తక్కువగా ఉన్నానంటూ తన కలర్ గురించి కూడా మాట్లాడారని ఈమె తెలియజేశారు.
ఇకపోతే తాను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తన పెళ్లి పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపించారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు. తాను ముస్తఫా రాజ్ తో నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తమ నిశ్చితార్థపు ఫోటోలు పై చాలా మంది తీవ్ర వ్యతిరేకత చూపించారని ఈమె తెలియజేశారు.
ఇలా మా ఎంగేజ్మెంట్ ఫోటోలపై స్పందించిన కొందరు నువ్వు ఎందుకు ఇలా ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు అంటూ తనని ప్రశ్నించారని ఈమె తెలిపారు. ఇలా నా గురించి కామెంట్స్ చేసిన వారందరికీ నేను చెప్పేది ఒకటే,ఇది నా జీవితం నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలి అనేది పూర్తిగా నా నిర్ణయం అంటూ ఈ సందర్భంగా ఈమె కామెంట్ చేశారు. ఇలా అప్పటినుంచి తాను సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం మానేశానని తెలియజేశారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…