Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

Mahesh Babu-Radha: సూపర్ స్టార్ మహేష్ బాబు చివరి సినిమా విడుదలై దాదాపు చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం అతడు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. దీనికి సంబంధించి ఇటీవల మూవీ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!
Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మహేష్ బాబుకు సర్జరీ అవ్వడం.. కరోనా పాజిటివ్ రావడం లాంటివి జరగడంతో సినిమా షూటింగ్ లో పాల్గొనలేకపోయాడు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్ పనులు మొదలు పెట్టేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‏గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahesh Babu-Radha: మహేష్ బాబు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి తార రాధ!

అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. దీంతో ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

త్రివిక్రమ్ కు ఇలా చేయడం అలవాటే..

ఈ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ రాధ కీలక పాత్రలో కనిపించనుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మహేష్ బాబుకు తల్లి క్యారెక్టర్ లో ఆమె పాత్రను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను మూవీ చిత్ర బృందం సంప్రదించినట్లు సమాచారం. ఇక 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రాధా వివాహం తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయ్యారు. ఈ చిత్రంతో మళ్లీ వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఆమె అభిమానులు మాత్రం ఖుషీ ఖుషీగా ఉన్నారు. తమ అభిమాను హీరోయిన్ ను మళ్లీ సినిమాల్లో ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇక సీనియర్ హీరోయిన్లను తన సినిమాల్లో అవకాశం ఇవ్వడం త్రివిక్రమ్ కు మొదటి నుంచి కూడా అలవాటే. అత్తారింటికి దారేదిలో నదియాకు,
అజ్ఞాతవాసిలో ఖుష్బూ, అల వైకుంఠపురములో టబులకు అవకాశం ఇచ్చారు.