Bhairava Dweepam: భైరవ ద్వీపం సినిమా సెన్సార్ విషయంలో అంత కథ నడిచిందా.. గుర్రాల కోసం వార్నింగ్?
Bhairava Dweepam: సింగీతం శ్రీనివాస రావు-బాలకృష్ణ క్రేజీ కాంబినేషన్ అని చెప్పవచ్చు. వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన ‘ ఆదిత్య 369‘ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా తరువాత వచ్చిన ‘ భైరవ ద్వీపం’ కూడా పెద్ద హిట్ గా నిలిచింది.
1994వ సంవత్సరంలో ఎప్రిల్ 14న ఈ విడుదలైన ఈ మూవీ అన్ని సెంటర్లలో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు ఏకంగా అన్ని విభాగాల్లో మొత్తం 9 నంది అవార్డులను సొంతం చేసుకుంది.
బాలకృష్ణ సరసన రోజా హీరోయిన్ గా నటించింది. జానపద చిత్రంగా వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఓ సామాన్య వీరుడు.. ఓ రాజు కుమర్తెను భైరవుడనే మాంత్రికుడి నుంచి రక్షించే కథతో ఈ సినిమా వచ్చింది. రావి కొండలరావు అందించిన కథ, మాటలు, మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి
ఇదిలా ఉంటే ‘ భైరవ ద్వీపం’ సెన్సార్ సమయంలో చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన సంఘటన ఎదురైందట. అయితే ముందుగా అనుకున్న ప్రకారం సినిమాకు సెన్సార్ జరిగింది. అయితే చిత్ర యూనిట్ కు మాత్రం ఓ విషయంలో వార్నింగ్ ఇచ్చారట. మా వరకు సినిమాపై ఎలాంటి అభ్యంతరం లేదని.. కాకపోతే బాణాలకు గుర్రాలకు తగిలి పడిపోయిన సీన్లు కొన్ని ఉన్నాయని.. వాటికి అభ్యంతరం వ్యక్తం అవ్వచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయట. వన్యప్రాణి సంరక్షణ సంఘం వాళ్లు ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారట. అలా జరిగితే ఆ సీన్లను తొలగించవచ్చు అని కోరే అవకాశం ఉందని అన్నారు. అయితే సినిమా విడుదలయ్యాక వీటిని ఏమాాత్రం పట్టించుకోలేదు. సినిమా సూపర్ హిట్ అయింది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…