రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం బాధాకరం_ రాజాసింగ్

జాతీయ జెండాను ఎగురవేసి ర్యాలీని నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ వ్యక్తం అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం బాధాకరమన్నారు. కేసీఆర్​ పాలనలో జాతీయ జెండా ఎగురవేస్తే కేసులు పెడతాం, రౌడీషీట్లు తెరుస్తాం అని పోలీసులు బెదిరించడం సిగ్గుచేటని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా ప్రతి ఏడాది గోషామహల్​ నియోజకవర్గంలో ఆగస్టు 15న చిన్నపాటి ర్యాలీ తీస్తామని రాజాసింగ్​ అన్నారు. జాతీయ పతాకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా ఉంటుందని చెప్పారు. రెండేళ్ల క్రితం ర్యాలీ తీసినందుకు ట్రాఫిక్​ జామ్​ అయిందనే సాకుతో కొందరిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ సారి కూడా అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారని వెల్లడించారు.