కరోనా కాలంలో ప్రతీ ఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇల్లును విక్రయించాలనుకుంటుంటే.. మరి కొంత మంది కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
ఈ మహమ్మారి పరిస్థితులు ఎదురైనా.. ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు 15 సందర్భంగా దేశంలో ఎవరైనా హోం లోన్ తీసుకోవాలనుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు అనేది తీసుకోవడం లేదంటూ తెలిపింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున..హోం లోన్లపై సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ట్వీట్ చేసింది. దీంతో హోం లోన్ తీసుకునే మహిళా ఖాతాదారులకు మరొక వడ్డీ రాయితీ లభించనుంది. యోనో యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులు కూడా యోనో ద్వారా దరఖాస్తు చేసినట్లయితే వారికి కూడా 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభించనుంది.
హోం లోన్లకు ఎస్బీఐ వడ్డీ రేటను 6.70శాతంగా పేర్కొంది. అంతేకాకుండా హోం లోన్ తీసుకునే వారు 7208933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా లోన్ పొందే అవకాశం ఉంటుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…