కరోనా కాలంలో ప్రతీ ఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇల్లును విక్రయించాలనుకుంటుంటే.. మరి కొంత మంది కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
ఈ మహమ్మారి పరిస్థితులు ఎదురైనా.. ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు 15 సందర్భంగా దేశంలో ఎవరైనా హోం లోన్ తీసుకోవాలనుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు అనేది తీసుకోవడం లేదంటూ తెలిపింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున..హోం లోన్లపై సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ట్వీట్ చేసింది. దీంతో హోం లోన్ తీసుకునే మహిళా ఖాతాదారులకు మరొక వడ్డీ రాయితీ లభించనుంది. యోనో యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులు కూడా యోనో ద్వారా దరఖాస్తు చేసినట్లయితే వారికి కూడా 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభించనుంది.
హోం లోన్లకు ఎస్బీఐ వడ్డీ రేటను 6.70శాతంగా పేర్కొంది. అంతేకాకుండా హోం లోన్ తీసుకునే వారు 7208933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా లోన్ పొందే అవకాశం ఉంటుంది.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…