కరోనా కాలంలో ప్రతీ ఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సొంత ఇళ్లు ఉండాలని కూడా కోరుకుంటున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఇల్లును విక్రయించాలనుకుంటుంటే.. మరి కొంత మంది కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
ఈ మహమ్మారి పరిస్థితులు ఎదురైనా.. ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంకింగ్ ఆఫ్ ఇండియా ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఆగస్టు 15 సందర్భంగా దేశంలో ఎవరైనా హోం లోన్ తీసుకోవాలనుకున్న వారికి ప్రాసెసింగ్ ఫీజు అనేది తీసుకోవడం లేదంటూ తెలిపింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున..హోం లోన్లపై సున్నా ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ట్వీట్ చేసింది. దీంతో హోం లోన్ తీసుకునే మహిళా ఖాతాదారులకు మరొక వడ్డీ రాయితీ లభించనుంది. యోనో యాప్ వినియోగిస్తున్న ఖాతాదారులు కూడా యోనో ద్వారా దరఖాస్తు చేసినట్లయితే వారికి కూడా 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభించనుంది.
హోం లోన్లకు ఎస్బీఐ వడ్డీ రేటను 6.70శాతంగా పేర్కొంది. అంతేకాకుండా హోం లోన్ తీసుకునే వారు 7208933140 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా లోన్ పొందే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…