పిల్లలను ఎప్పుడు కంటారు అని రిపోర్టర్ అడిగితే.. ఉపాసన ఎం చెప్పారో తెలుసా?

తెలుగు సినిమాలో బెస్ట్ అండ్ క్యూట్ కపుల్స్ లో చెప్పుకోదగిన జంట రామ్ చరణ్, ఉపాసన. ఎంతో అన్యోన్యంగా ఉంటుంది ఈ జంట. వీరికి పెళ్లై ఎనిమిదేళ్ళు అవుతోంది. అయితే ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ ఒకే పీరియడ్‌లో పెళ్లిళ్లు చేసుకున్నారు.

అయితే ఇందులో రామ్ చరణ్ తప్పా మిగిలిన హీరోలిద్దరూ తండ్రులు అయ్యారు. దీంతో ఎక్కడికెళ్ళినా పిల్లలు ఎప్పుడనే ప్రశ్న ఉపాసనకు ఎదురవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చింది ఉపాసన. పిల్లల విషయం ఎందుకు లేట్ చేస్తున్నారంటూ ప్రశ్నించగా.. ఆ ప్రశ్నకు ఆమె కాస్త అసహనానికి లోనయింది.

జూనియర్ రామ్ చరణ్.. జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అని యాంకర్ అడిగింది. దానికి ఉపాసన కాస్త ఘాటుగా స్పందించింది. పిల్లల విషయం తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది ఉపాసన. దీనిపైన చాలామంది అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేసింది.

ఇప్పుడు నేను దాని మీద ఎలా స్పందించినా కూడా మీడియాలో సెన్సేషన్ అవుతుంది. అనుకునే వాళ్లు ఏదైనా అనుకోనివ్వండి.. నేను దీనికి సమాధానం చెప్పను. మీరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. దీనికి సరైన సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని తెలిపింది. కాగా రామ్ చరణ్ నటించిన సినిమాలలో రంగస్థలం చిత్రం తనకెంతో ఇష్టమని వెల్లడించింది ఉపాసన.