టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను పూర్తి చేసుకున్న మెగాస్టార్ అనంతరం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా దీన్ని రూపొందిస్తున్నారు.
ఈ గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ ని ఊటీలో పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు చేతికి స్వల్ప గాయం అవడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మలయాళ వెర్షన్ లో పృథ్విరాజ్ సుకుమారన్ పోషించిన పాత్ర కోసం తెలుగులో ఎవరిని తీసుకుంటారు అన్న విషయం ఫై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే ఈ పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించగా, ఆ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ విషయం పై దర్శక నిర్మాతల నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. అంతే కాకుండా ఇందులో ఒక పాట కోసం హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్ కూడా సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి.
ఈ విషయాలపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గాడ్ ఫాదర్ సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన పాట కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టు గానే ఉండాలని బ్రిట్నీ స్పియర్ తో పాడించేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఆమెతో ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా మరేదైనా అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఇక తమన్ చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇందులో సల్మాన్ ఖాన్ కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…