నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం జాతి రత్నాలు.ఈ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్గా ఫరియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి రత్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఈమె మరింత ఫేమ్ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అందరినీ ఆకట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్ను ఖాతాలో వేసుకుంది.
మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తర్వాత ఈమె దశ మారిపోతుందని అందరూ భావించారు. కానీ అదేమీ జరగలేదు. మొదటి సినిమా తర్వాత ఈమెకు వరసగా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను అని ఫరియా తెలిపింది కాని అలాంటిది ఏమీ జరగలేదు. ఈ నేపథ్యంలోనే రవితేజ సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే.
అవన్నీ కూడా రూమర్స్ అని రవితేజ సినిమాలో హీరోయిన్స్ ని చూశాక క్లారిటీ వచ్చింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎట్టకేలకు పరియా అబ్దుల్లాకు ఒక పేరున్న సినిమాలో అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. శీను వైట్ల దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా తెరకెక్కబోయే ఢీ అంటే ఢీ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల తాజాగా ప్రకటించారు.త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.
అనంతరం ఢీ సినిమా గురించి మాట్లాడుతూ.. డీ కథ సీక్వెల్ కథ రెండు వేరు వేరు అని తెలిపాడు. కాకపోతే ఢీ లో ఉండే కొన్ని క్యారెక్టర్లు మాత్రం సీక్వెల్ లో వాడు కాబోతున్నట్లు తెలిపాడు. అలాగే గత సినిమాల్లో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటున్నాను అని తెలిపారు. ఈ సినిమాకు గోపీమోహన్, చూడు గోపాల్ రచయితలుగా చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…