బాబాయ్ కోసం న్యూస్ ఛానల్ కొనుగోలు చేస్తున్న రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ దర్శకులు రాజమౌళి, శంకర్ సారథ్యంలో సినిమాలను తీస్తున్నారు. అతడు హీరోగానే కాకుండా.. నిర్మాతగా కూడా ఎంతో విజయవంతం అయినట్లు నిరూపించుకున్నాడు. అతడు సినిమాల ద్వారానే కాదు.. అటు బిజినెస్ లల్లో కూడా పెట్టుబడి పెట్టి సంపాదిస్తున్నారు.

తన భార్య ఉపాసన కూడా బిజినెస్ లో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అతడు అందకముందు ట్రూజెట్ లాంటి సంస్థల్లో పెట్టుబడి పెట్టి లభాలను గడించిన విషయం తెలిసిందే. అయితే అతడు ప్రస్తుతం ఓ న్యూస్ ఛానల్ ను కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఫార్మాల్టీస్ మొత్తం పూర్తయ్యాయని కూడా తెలుస్తోంది. ఆ ఛానల్ పెద్ద పాపులారిటీ ఉన్నది కాదు.. ప్రస్తుతం నష్టాల్లో కూడా నడుస్తుంది.

ఆ ఛానల్ ఎంతో మంది చేతులు మారినట్లు సమాచారం. దీంతో ఆ యజమాని రాం చరణ్ కు ఈ ఛానల్ ను అమ్ముతున్నారు. ఇంత నష్టాల్లో ఉన్నా రాంచరణ్ పెట్టుబడితో దానిని లాభాల్లోకి తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.

జనసేన పార్టీ అధినేతకు న్యూస్ ఛానల్ బలం ఎక్కువగా లేదు. ఆ మీడియా బలాన్ని రెట్టింపు చేయడానికి అతడు ఈ ప్లాన్ వేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా రామ్ చరణ్ మరో రెండు ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లను కూడా కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. వాళ్లతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారట.