Movie News

మా బిల్డింగ్ వ్యవహారంపై మరో రగడ.. అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు..

టాలీవుడ్ మూవీ అసోసియేషన్(మా) ఎన్నికలు నేషనల్ పాలిటిక్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా నడుస్తున్నాయి. మా ఎన్నికల సందడి మొదలైన దగ్గర నుంచి ప్రతీ రోజు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. హీరో విష్ణు కొత్త బిల్డింగ్ ప్రస్తావన తీసుకు వచ్చిన దగ్గర నుంచి వ్యవహారం మొత్తం దాని చుట్టే తిరుగుతోంది. అయితే పాత మా బిల్డింగ్ అమ్మకంపై ప్రస్తుతం రచ్చ జరుగుతోంది.

నాగబాబు, మోహన్ బాబు వీటిపై తీవ్రంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. రూ. 90 లక్షలు విలువ చేసే బిల్డింగ్ ను కేవలం రూ. 30 లక్ష్లల ఎలా విక్రయించారని హీరో మోహన్ బాబు ప్రశ్నించగా.. దానికి కౌంటర్ గా నాగబాబు.. దానికి సంబంధించి నరేశ్, శివాజీ రాజాను అడగాలని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పష్టంగా వివరణ ఇస్తూ.. బిల్డింగ్ కొనుగోలు చేసిన సమయంలో తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు సినీ పెద్దల సూచనలు, అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకొనే 71 లక్షల 73వేలతో భవనాన్ని కొనుగోలు చేశామన్నారు.

అలాగే, ఇంటీరియర్ డిజైన్ కోసం మరో మూడు లక్షలు వెచ్చించినట్లు వివరించారు. 2006 నుంచి 2008 వరకూ తానే అధ్యక్షుడిగా ఉన్నానన్న నాగబాబు అధ్యక్ష పీఠం నుంచి దిగిన తర్వాత ‘మా’ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా భాగస్వామిని కాలేదని దానికి కావాల్సిన సలహాలు మాత్రమే ఇచ్చానన్నారు. బిల్డింగ్ అమ్మకం గురించి మళ్లీ తనపై వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే, నాగబాబు వ్యాఖ్యలపై 24 గంటలు గడవక ముందే శివాజీరాజా రియాక్ట్ అయ్యారు. నాగబాబు హయాంలో ఎంత నిజాయతీతో ఆ ఫ్లాట్ కొన్నారో, తాను అధ్యక్షుడిగా, నరేశ్ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంతే నిజాయతీతో అమ్మేశామని కౌంటర్ ఇచ్చారు.

అధ్యక్షుడిగా ఉన్న నరేష్ కూడా దీనిపై స్పందించారు.. స్పందించారు. అమ్మింది బిల్డింగ్ కాదని, కేవలం ప్లాట్ మాత్రమే అన్నారు. అక్కడ ఉన్న బిల్డింగ్ కు ఎలాంటి అద్దెలు రావడం లేదు. సింగిల్ వాల్ హౌస్, అలాగే పక్కనే మురుగు కాలువ కావడంతో ఆర్టిస్ట్స్ ఇబ్బంది పడేవారు. దీనితో ఆ ఫ్లాట్ అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేపర్లలో ప్రకటనను ఇచ్చినా ఎవరూ ముందుకు రాలేదు కావునా రూ. 30 లక్షలకకు అమ్మినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆ బిల్డింగ్ కొన్న రేటుకు.. అమ్మిన రేటుకు ఇంత వ్యత్యాసం ఉండటంతో దాదాపు రూ.60 లక్షల వరకు అవకతవకలు జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మా ఎన్నికల వ్యవహారంలో అసోసియేషన్ బిల్డింగ్ ఎపిసోడ్ కీలకంగా మారినట్లు కనిపిస్తోంది. ఇది చివరకు ఎటు దారి తీస్తుందో చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

4 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

4 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

4 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

4 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

4 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

4 hours ago