Ramesh Babu: కృష్ణ ఇందిరా మరణంతో ఒంటరైంది మహేష్ బాబు కాదు… రమేష్ బాబు భార్య!

Ramesh Babu: ఘట్టమనేని కుటుంబానికి ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కృష్ణ తల్లి ఇందిరాదేవి, మూడు రోజుల క్రితం నటుడు కృష్ణ మరణించారు. ఈ విధంగా ఒకే ఏడాదిలోనే మహేష్ బాబు తన తల్లిదండ్రిని తన సోదరుడిని కోల్పోవడం ఎంతో విషాదం.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు కూడా దూరం కావడంతో మహేష్ బాబు ఒంటరయ్యారనీ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి కృష్ణ ఇందిరాదేవి రమేష్ బాబు మరణంతో మహేష్ బాబు ఒంటరి కాలేదు రమేష్ బాబు భార్య మృదుల ఒంటరి అయ్యారు.

కృష్ణ వారసుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు సామ్రాట్ సిమాతో హీరోగా మారారు. ఈ విధంగా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. ఇలా మృదలను వివాహం చేసుకున్న రమేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి భారతి అబ్బాయి జయకృష్ణ అనే ఇద్దరు సంతానం కలరు.

Ramesh Babu:పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న మృదుల..

ఈ విధంగా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. తన భర్త దూరమైన అత్తమామలు తనకు అండగా ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి మృదులకు ఈ ఏడాదిలోనే తన అత్తమామలు కూడా మరణించడంతో మృదుల ఒంటరి అయిందనీ, ఆమెకు మహేష్ బాబు ఫ్యామిలీ అండదండలు కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.