Ramesh Babu: ఘట్టమనేని కుటుంబానికి ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కృష్ణ తల్లి ఇందిరాదేవి, మూడు రోజుల క్రితం నటుడు కృష్ణ మరణించారు. ఈ విధంగా ఒకే ఏడాదిలోనే మహేష్ బాబు తన తల్లిదండ్రిని తన సోదరుడిని కోల్పోవడం ఎంతో విషాదం.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు కూడా దూరం కావడంతో మహేష్ బాబు ఒంటరయ్యారనీ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి కృష్ణ ఇందిరాదేవి రమేష్ బాబు మరణంతో మహేష్ బాబు ఒంటరి కాలేదు రమేష్ బాబు భార్య మృదుల ఒంటరి అయ్యారు.
కృష్ణ వారసుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు సామ్రాట్ సిమాతో హీరోగా మారారు. ఈ విధంగా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. ఇలా మృదలను వివాహం చేసుకున్న రమేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి భారతి అబ్బాయి జయకృష్ణ అనే ఇద్దరు సంతానం కలరు.
ఈ విధంగా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. తన భర్త దూరమైన అత్తమామలు తనకు అండగా ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి మృదులకు ఈ ఏడాదిలోనే తన అత్తమామలు కూడా మరణించడంతో మృదుల ఒంటరి అయిందనీ, ఆమెకు మహేష్ బాబు ఫ్యామిలీ అండదండలు కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…