Ramesh Babu: ఘట్టమనేని కుటుంబానికి ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఈ ఏడాది మొదట్లోనే కృష్ణ మొదటి కుమారుడు రమేష్ బాబు కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. అదేవిధంగా సెప్టెంబర్ నెలలో కృష్ణ తల్లి ఇందిరాదేవి, మూడు రోజుల క్రితం నటుడు కృష్ణ మరణించారు. ఈ విధంగా ఒకే ఏడాదిలోనే మహేష్ బాబు తన తల్లిదండ్రిని తన సోదరుడిని కోల్పోవడం ఎంతో విషాదం.
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు కూడా దూరం కావడంతో మహేష్ బాబు ఒంటరయ్యారనీ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి కృష్ణ ఇందిరాదేవి రమేష్ బాబు మరణంతో మహేష్ బాబు ఒంటరి కాలేదు రమేష్ బాబు భార్య మృదుల ఒంటరి అయ్యారు.
కృష్ణ వారసుడిగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రమేష్ బాబు సామ్రాట్ సిమాతో హీరోగా మారారు. ఈ విధంగా హీరోగా పలు సినిమాలలో నటించిన ఈయన పెద్దలు నిశ్చయించిన వివాహం చేసుకున్నారు. ఇలా మృదలను వివాహం చేసుకున్న రమేష్ బాబు దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అమ్మాయి భారతి అబ్బాయి జయకృష్ణ అనే ఇద్దరు సంతానం కలరు.
ఈ విధంగా కుటుంబంతో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి రమేష్ బాబు ఈ ఏడాది మొదట్లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ మరణించారు. తన భర్త దూరమైన అత్తమామలు తనకు అండగా ఉన్నారని ఎంతో ధైర్యంగా ఉన్నటువంటి మృదులకు ఈ ఏడాదిలోనే తన అత్తమామలు కూడా మరణించడంతో మృదుల ఒంటరి అయిందనీ, ఆమెకు మహేష్ బాబు ఫ్యామిలీ అండదండలు కూడా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…