Rana : భూ వివాదంలో ఇరుక్కున్న దగ్గుబాటి ఫ్యామిలీ… కోర్టు మెట్లు ఎక్కబోతున్న రానా…!

Rana : దగ్గుబాటి ఫ్యామిలీ అనగానే ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం. డాక్టర్ రామా నాయుడు గారు ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కాకుండా రామా నాయుడు స్టూడియో కూడా నిర్మించారు. ఇక కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా ఇండస్ట్రీ లోనే ఉన్నారు. సురేష్ బాబు సినిమా ప్రొడ్యూసర్ గా మారితే వెంకటేష్ హీరోగా టాప్ హీరోస్ లో ఒకరిగా ఉన్నారు. ఇక వాళ్ళ ఇంటి నుండి ఈ తరంలో వారసుడిగా వచ్చిన రానా దగ్గుబాటి రొటీన్ కథలను కాకుండా కమర్షియల్ పంథా లో పోకుండా నటనకు ఆస్కారమున్న సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఎప్పుడూ వివాదాల్లో ఉండని దగ్గుబాటి ఫ్యామిలీ మొదటి సారి వివాదం లో చిక్కుకున్నారు.

మాధవిలత ల్యాండ్ ను రిజిస్టర్ చేసుకున్న రానా…

ఫిలిం నగర్ లో రానా పేరిట ఉన్న వెయ్యి గజాల స్థలం రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే ఆ ల్యాండ్ నటి మాధవి లత పేరిట ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండడంతో మాధవి లత సిటీ సివిల్ కోర్ట్ ను ఆశ్రయించింది. 2014 లో మాధవిలత రెండు వేల రెండోందల గజాల ఆ ల్యాండ్ ను ఒక వ్యాపార వేత్తకు లీజుకి ఇచ్చింది. ఆ తరువాత లీజు కొనసాగుతు వస్తోంది.

అయితే అదే సమయంలో రానా పేరిట ఆ ల్యాండ్ ను రిజిస్టర్ చేయించారు దగ్గుబాటి ఫ్యామిలీ. తప్పు ఎవరి వైపు ఉందో తెలియదు కానీ ఆ ల్యాండ్ ప్రస్తుతం మాధవి లతది అని సమాచారం. సిటీ సివిల్ కోర్ట్ కి నేడు రానా దగ్గుబాటి హాజరయ్యారు. ఒకవేళ ఫోర్జెరీ లాంటివి జరిగాయా లేదా డబల్ రిజిస్ట్రేషన్ జరిగిందా అన్నది కోర్ట్ తేల్చాల్సి ఉంది. ఒకవేళ రానా దగ్గుబాటి వైపు తప్పుండి ఫోర్జరీ వంటివి జరుగుంటే మాధవి లత కు ఇప్పటివరకు అయిన కోర్ట్ ఖర్చులు, సమయం వృధా అయినందుకు మొత్తం లెక్కగట్టి జరిమానా విధించవచ్చు.