Actress Rajasri Nair: టేక్స్ ఎక్కువ తీసుకునేసరికి సెట్ లో అందరూ అదోలా చూస్తున్నారు.. సెట్స్ లో రావు రమేష్ ఎలా ఉంటారంటే… అసలు విషయాలు బయటపెట్టిన నటి రాజశ్రీ నాయర్!

Actress Rajasri Nair: రాజశ్రీ నాయర్ పలు తెలుగు తమిళ చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశ్రీ నాయర్ తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Actress Rajasri Nair: రావు రమేష్ సెట్లో అలా ప్రవర్తించే వారు.. అసలు విషయాలు బయటపెట్టిన నటి రాజశ్రీ నాయర్!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలో నటించడం ఇష్టం ఉండదని ఒక సీరియల్లో నెగిటివ్ పాత్రలో చేసినపుడు తరువాత సీరియల్లో పాజిటివ్ పాత్రలో నటిస్తానని తెలియచేసారు. ఇక నెగిటివ్ పాత్రలో నటించినప్పుడు చూడగానే విలన్ రూపం ఉండేలా తాను ఎప్పుడు మేకప్ వేసుకోనని, చాలా సింపుల్ గా మేకప్ ఉన్నప్పటికీ నా మైండ్ లో మాత్రం చాలా నెగటివ్ ఆలోచనలు ఉంటాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈమె మాట్లాడుతూ మేఘసందేశం సినిమా షూటింగ్లో ఒక సీన్ చేయడం కోసం తాను 26 టేకులు తీసుకున్నానని తెలిపారు. అసలే సాయంత్రం అవుతుంది అందరూ కూడా ప్యాకప్ చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలో నేను ఆ సీన్ కంప్లీట్ చేస్తే త్వరగా వెళ్ళిపోవాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సన్నివేశం ఏకంగా 26 టేకులు తీసుకునే సరికి అందరూ నా వైపు అదోలా చూశారని రాజశ్రీ వెల్లడించారు.

Actress Rajasri Nair: రావు రమేష్ సెట్లో అలా ప్రవర్తించే వారు.. అసలు విషయాలు బయటపెట్టిన నటి రాజశ్రీ నాయర్!

అద్భుతమైన నటుడు…

ఈ క్రమంలోనే తనతో పాటు నటించిన సహ నటుడు రావు రమేష్ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. రావు రమేష్ తో కలిసి తాను సుమారు ఐదు చిత్రాల వరకు నటించానని, ఆయన సెట్లో ఎల్లప్పుడు ఎంతో రెస్పెక్ట్ గా మాట్లాడతారని, తను ఒక అద్భుతమైన నటుడని ఈమె తెలిపారు. అది ఒక కామెడీ సీన్ అయినా లేదా ఒక విలన్ పాత్రలోనైనా, ఒక తండ్రి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారని, ఆయనలో గొప్ప నటుడు ఉన్నారంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.