Venu Swamy: వేణు స్వామి జాతకాన్ని బయటపెట్టనున్న తెలంగాణ ఎన్నికలు.. టార్గెట్ అయిన వేణు స్వామి?

Venu Swamy: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై అందరూ చూపు ఉంది. నవంబర్ 30వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అయితే ఈసారి పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదు కావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3వ తేదీ వెలబడునున్నాయి. దీంతో అందరి చూపు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉంది ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్ , సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పాయి.

ఇకపోతే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామిని టార్గెట్ చేయబోతున్నాయని ఆయన జాతకాన్ని తెలంగాణ ఎన్నికల ఫలితాలు బయటపెట్టబోతున్నాయి అంటూ కొందరు ఈయన పాత వీడియోలను వైరల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. ఈ మధ్యకాలంలో ఈయన సినీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి జాతకాలను తెలియజేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటివరకు వేణు స్వామి చెప్పిన విధంగానే అన్ని జరుగుతూ వచ్చాయి గతంలో కూడా వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాలకు కాబోయే ముఖ్యమంత్రిల గురించి కూడా తెలియజేశారు.వచ్చి ఎన్నికలలో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తారని ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పారు అయితే పలు సర్వేలు మాత్రం ఈయన మాటలకు విరుద్ధంగా ఫలితాలను తేల్చి చెప్పాయి. దీంతో వేణు స్వామి టార్గెట్ అయ్యారు.

వేణు స్వామి జ్యోతిష్యం నిజం అవుతుందా…

వేణు స్వామి చెప్పిన విధంగా బిఆర్ఎస్ గెలిస్తే పర్లేదు కానీ అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వేణు స్వామి జాతకం తేట తెల్లం కానుంది. దీంతో వేణు స్వామి జాతకానికి ఇదొక పరీక్షలాగా మారిపోయిందని ఈ ఎన్నికల ఫలితాలు ఆయన జాతకాన్ని బయట పెట్టబోతున్నాయని తెలుస్తుంది. మరి వేణు స్వామి చెప్పిన విధంగా ఈసారి తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వమే వస్తుందా లేదా అన్నది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.