Featured

Chaitanya Krishna: శాపం వల్లే నందమూరి ఫ్యామిలీలో వరస మరణాలు జరుగుతున్నాయా… ఎమోషనల్ అయిన చైతన్య కృష్ణ?

Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో ఈ మధ్యకాలంలో వరస మరణాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ తర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డారు. ఇక తారకరత్న కూడా ఇటీవల మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మరణాలన్నింటి గురించి తాజాగా నందమూరి చైతన్యకృష్ణ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చైతన్య కృష్ణ గత రెండు దశాబ్దాల క్రితమే హీరోగా నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాజాగా ఈయన బ్రీత్ అనే సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి చైతన్య కృష్ణ తన ఫ్యామిలీ గురించి రాజకీయాల గురించి సినిమాల గురించి కూడా మాట్లాడారు.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు నందమూరి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వరస మరణాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏదైనా శాపం వల్ల వరుస మరణాలు జరుగుతున్నాయా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు చైతన్య కృష్ణ సమాధానం చెబుతూ శాపం వల్లే అని కాదు కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా కొన్ని ట్రాజడీలు జరుగుతూ ఉంటాయి అలాగే మా ఫ్యామిలీలో కూడా జరిగి ఉంటాయి ఏమోనని ఈయన తెలిపారు.

వారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం…

ఇలా మా కుటుంబంలో వరుస మరణాలు జరగడం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని తెలియజేశారు.హరికృష్ణ బాబాయ్ తో పాటు జానకిరామ్ తారకరత్న మరణ వార్త మమ్మల్ని బాగా కలిసి వేసిందని తెలిపారు. ఇక జానకిరామ్ నందమూరి తారక రామారావు మనవడు అంటే ఎవరు నమ్మరని అంత సింపుల్గా ఎలాంటి గర్వం లేకుండా ఉంటారని చైతన్య కృష్ణ తెలిపారు. ఇక తారకరత్న కూడా ఏమాత్రం గర్వం లేకుండా తన ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎదిగే రకం కాదని తారకరత్న నాతో చాలా మంచి సన్నిహితంగా ఉండేవారని చైతన్య కృష్ణ ఈ సందర్భంగా వారి మరణాలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేసవిలో సబ్జా గింజలు ఎలా తీసుకోవాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు!

వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…

6 seconds ago

భర్తను చంపేందుకు భార్య మాస్టర్ ప్లాన్.. చివరికి తానే చిక్కుల్లో!

కడప జిల్లాలో సంచలనం రేపిన ఓ హత్యాయత్నం కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాంపత్య కలహాలు తీవ్రరూపం దాల్చడంతో భర్తను…

38 minutes ago

‘కమ్సహమ్నిదా’ మేకింగ్ వీడియో వైరల్.. వరుణ్ తేజ్ మూవీకి హైప్ పెరిగింది!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. హారర్…

1 hour ago

వరుస ఫ్లాప్‌ల తర్వాత నితిన్ కొత్త గేమ్ ప్లాన్.. సితార బ్యానర్‌లో భారీ ప్రాజెక్ట్!

వరుస పరాజయాలతో కొంత వెనుకబడిన యువ హీరో నితిన్, ఈసారి హిట్ ట్రాక్‌లోకి రావాలనే లక్ష్యంతో కొత్త ప్రాజెక్ట్‌ను ఎంపిక…

1 hour ago

‘వైద్యో నారాయణో హరి’ని నిజం చేసిన రాజశేఖర్.. స్టార్ కూతురి ప్రాణాలు కాపాడిన కథ!

సినిమాల్లో యాంగ్రీమ్యాన్‌గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజశేఖర్, నిజ జీవితంలో మాత్రం ఎంతో మానవతా భావంతో కూడిన వైద్యుడని…

1 hour ago

ఓటమి తర్వాత హార్దిక్ ప్రవర్తనపై చర్చ.. కెప్టెన్‌గా ఒత్తిడి పెరుగుతుందా?

ఐపీఎల్ 2026 సీజన్ ముంబై ఇండియన్స్‌కు కష్టకాలంగా మారింది. వరుస ఓటములతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న జట్టుకు, చెన్నై సూపర్…

1 hour ago