Chaitanya Krishna: నందమూరి కుటుంబంలో ఈ మధ్యకాలంలో వరస మరణాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆ తర్వాత హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదం నుంచి బ్రతికి బయటపడ్డారు. ఇక తారకరత్న కూడా ఇటీవల మరణించిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ మరణాలన్నింటి గురించి తాజాగా నందమూరి చైతన్యకృష్ణ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చైతన్య కృష్ణ గత రెండు దశాబ్దాల క్రితమే హీరోగా నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ ఈయన మాత్రం ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తాజాగా ఈయన బ్రీత్ అనే సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి చైతన్య కృష్ణ తన ఫ్యామిలీ గురించి రాజకీయాల గురించి సినిమాల గురించి కూడా మాట్లాడారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు నందమూరి ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వరస మరణాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఏదైనా శాపం వల్ల వరుస మరణాలు జరుగుతున్నాయా అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు చైతన్య కృష్ణ సమాధానం చెబుతూ శాపం వల్లే అని కాదు కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా కొన్ని ట్రాజడీలు జరుగుతూ ఉంటాయి అలాగే మా ఫ్యామిలీలో కూడా జరిగి ఉంటాయి ఏమోనని ఈయన తెలిపారు.
వారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం…
ఇలా మా కుటుంబంలో వరుస మరణాలు జరగడం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నామని తెలియజేశారు.హరికృష్ణ బాబాయ్ తో పాటు జానకిరామ్ తారకరత్న మరణ వార్త మమ్మల్ని బాగా కలిసి వేసిందని తెలిపారు. ఇక జానకిరామ్ నందమూరి తారక రామారావు మనవడు అంటే ఎవరు నమ్మరని అంత సింపుల్గా ఎలాంటి గర్వం లేకుండా ఉంటారని చైతన్య కృష్ణ తెలిపారు. ఇక తారకరత్న కూడా ఏమాత్రం గర్వం లేకుండా తన ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎదిగే రకం కాదని తారకరత్న నాతో చాలా మంచి సన్నిహితంగా ఉండేవారని చైతన్య కృష్ణ ఈ సందర్భంగా వారి మరణాలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…