Featured

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు అనేవి వస్తుంటాయి..వాటిని వాళ్లు నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకొని సంసార జీవితాన్ని కొనసాగించాలి. కానీ కొంతమంది వీటిని బూతద్దం పెట్టి చూసి.. అతి పెద్దదిగా చేసి విడాకుల వరకు వెళ్తారు. అయితే ఇటీవల కాలంలో విడాకలు తీసుకునే దంపతలు సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

విడాకలు సమయంలో అమ్మాయికి భర్త తరఫును భరణం అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ భరణం అనేది భర్త స్థోమతను బట్టి ఉంటుంది. కాని ఇక్కడ చెప్పే విడాకుల భరణం చరిత్రలోనే అత్యంత ఖరీదైనది. దాని గురించి తెలుసుకుందాం.. దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్- మక్తూమ్‌ను తన మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు 5వేల 555 కోట్లు విడాకుల భరణంగా ఇ‍వ్వాల్సిందేనని యూకేలోని లండన్‌ హైకోర్టు ఆదేశించింది.

ఆ వీడియోలో నిజం లేదు..దీప్తి నాకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు..షణ్ముఖ్!

అయితే అత్యవసరంగా.. ముందుగా.. రూ.2,521 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. వాటి తర్వాత మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో ఇవ్వాలని కూడా చెప్పింది. అంతే కాదు.. కోర్టు నుంచి తదుపరి తీర్పు వెలువరించే వరకు ఇద్దరు పిల్లలను.. వారి జీవితాంతం.. భద్రతా ఖర్చులను భరించాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఈ భరణం తీర్పు బ్రిటీష్ చరిత్రలోనే మొదటిసారి ఇలా వచ్చిందని చెబుతున్నారు. ఒక్క బ్రిటీష్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఇది అతి పెద్ద.. విడాకుల సెటిల్ మెంట్ గా ఇది నిలవనుంది.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్‌ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె.. పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరి. జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. అయితే ఆమె ఏ కారణంచేత ఇంటి నుంచి వెళ్లిపోయిందంటే.. ఆమె ఉంటున్న దర్భార్ లో ఆ రాజు.. మరొకరితో సన్నిహితంగా మెలుగుతున్నాడని.. అది తట్టుకోలేక ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది.

కానీ ఆ దుబాయ్ పాలకుడు..తన పిల్లలను ఇవ్వమని జర్మనీని కోరగా.. ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ కోర్టు పైన చెప్పిన విధంగా తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

యోగా గురించి మీరు నమ్ముతున్నవి నిజమేనా? నిపుణుల హెచ్చరిక!

ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధనకు మంచి ప్రాధాన్యం లభిస్తోంది. అయితే అదే సమయంలో యోగా గురించి…

4 minutes ago

15 ఏళ్లుగా సమోసాలకు దూరం.. అక్షయ్ సీక్రెట్ ఇదే!

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన ఫిట్‌నెస్, క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వెల్లడించారు.…

22 minutes ago

“లీసా” నా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది – హీరోయిన్ అనన్య నాగళ్ల

అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రామకృష్ణ ఐలా (యూఎస్ఏ)…

28 minutes ago

ఆరోగ్య రహస్యం మీ ఇంట్లోనే ఉంది… రోజూ అరటిపండు తింటున్నారా?

మన రోజువారీ జీవితంలో సులభంగా దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పండగలు, శుభకార్యాలు, ఇంటి వేడుకలు ఏవి జరిగినా ముందుగా…

34 minutes ago

ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. 12 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై విద్యార్థుల్లో ఆనందం నింపాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తూ, ఈ…

58 minutes ago

రోజూ ఒక గ్లాస్ కుంకుమపువ్వు నీరు… ఆరోగ్యానికి వరమా?

ఆహారంలో రంగు, వాసన కోసం మాత్రమే ఉపయోగించే కుంకుమపువ్వు నిజానికి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మందికి తెలియదు.…

1 hour ago