సినిమాలకు సాయిపల్లవి గుడ్ బై…సేవ చేయాలంటూ..?

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొంత సమయం లోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న సాయిపల్లవి గ్లామరస్ పాత్రలలో నటించకుండా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సాయి పల్లవి వ్యక్తిగత విషయానికి వస్తే…టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం సాయి పల్లవి శిక్షణ పొందిన ఒక డాక్టర్ అని చెప్పవచ్చు.

ఇలా డాక్టరేట్ పొందిన సాయి పల్లవి తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి డాక్టర్ వృత్తిని చేపట్టాలని భావించినట్లు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటే.. తనకు ఏ విధమైనటువంటి ఛాలెంజింగ్ రోల్స్ వచ్చిన తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు.

ప్రస్తుతం సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్నటువంటి  ‘శ్యామ్ సింగ రాయ్‌’లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఎంసీఏ విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.