AP Politics: ప్లాన్ ప్రకారమే దాడి చేశారు… జగన్ తాడిపై సజ్జల సంజ్జలవ్యాఖ్యలు!

AP Politics: రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై రాయితో దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే విజయ్ వాడలో నిన్న రాత్రి ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా బస్సు యాత్రలో ప్రయాణం చేస్తున్నారు అయితే విజయవాడలో ప్రజలకు అభివాదం చేస్తూ బస్సుపై ఎక్కినటువంటి ఈయనకు కొందరు అగంతకులు గురి చూసి రాయితో విసిరారు. దీంతో ఆ రాయి జగన్మోహన్ రెడ్డికి తగలడంతో పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంది.

జగన్మోహన్ రెడ్డి కంటి పై భాగంలో ఆ రాయి తగలడంతో ఆయనకు కుట్లు కూడా పడ్డాయి అలాగే పక్కనే ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కి సైతం ఈ రాయి తగలడంతో ఆయన కంటికి కూడా తీవ్రమైనటువంటి గాయం అయింది అయితే ఈ ఘటన గురించి టిడిపి నేతలు స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని వైసీపీ నేతలు ఇలాంటి కుట్ర చేసుకొని ఉంటారంటూ ఆరోపణలు చేస్తున్నారు.

ఈ ఆరోపణలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు మెడకాయ మీద తలకాయ ఉన్న ఏ మనిషి కడుపుకు అన్నం తిని ఏ వ్యక్తి కూడా ఇలా మాట్లాడారని తెలిపారు. మేమే రాళ్లు వేసుకొని ఒకరిపై నిందించే అవసరం తమకు లేదని వచ్చే ఎన్నికలలో తాము గెలుస్తామన్న కుట్రతోనే ఇలా చేశారని సజ్జల పేర్కొన్నారు. సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేకపోతున్నారని తెలిపారు ఇదంతా తెలుగుదేశం కుట్ర అంటూ ఆరోపణలు చేశారు.

అదృష్టం ఏం కాలేదు..
కింద నుంచి రాయి విసిరితే పైకు వెళ్లేటప్పటికీ అది వేగం తగ్గి ఎక్కడో ఒకచోట పడుతుంది కానీ కరెక్ట్ గా జగన్ మోహన్ రెడ్డికి ఎలా తగులుతుందని ఈయన తెలిపారు. ముందుగా ప్లాన్ ప్రకారమే అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాయి విసరడంతోనే ఆయన కంటికి గాయమైందని అదృష్టవశాత్తు జగన్ గారికి ప్రజలు ఆ దేవుడు ఆశీస్సుల వల్ల ఏం కాలేదని ఈయన తెలిపారు. అయితే ఈ ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి విచారణ చేయిస్తున్న సంగతి తెలిసిందే.