Pruthviraj sukumaran: ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు… పొరపాటున కూడా ఆయన వద్ద నోరు జారకూడదు: పృథ్వీరాజ్ సుకుమారన్

Pruthviraj sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్ త్వరలోనే సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన వరదరాజు మన్నార్ పాత్రలో నటించారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం వరస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇక రాజమౌళితో నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా పృథ్వీరాజ్ రాజమౌళి ఆతిథ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ మామూలుగానే షూటింగ్ లొకేషన్లో కనుక ఉంటే ఆయన అందరి కోసం ప్రత్యేకంగా వారికి ఇష్టమైనటువంటి ఫుడ్ తెప్పిస్తారు అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఒకరోజు తన భార్యతో సంవత్సరాల కూతురు షూటింగ్ లోకేషన్ కి వచ్చారు. ఆ సమయంలో ప్రభాస్ తనతో మాట్లాడుతూ నీకేం ఇష్టమని చెప్పడంతో చిన్నమ్మాయి కావడంతో తనకు ఇష్టమైనటువంటి చెప్పేసింది. షూటింగ్ లొకేషన్లో నా కూతురు చెప్పినటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆరోజు రాత్రికి మా ఇంటికి వచ్చాయని ఆ ఫుడ్ ఐటమ్స్ చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.

పొరపాటున నోరు జారకూడదు…


ఆరోజు వాటన్నింటిని పెట్టించడానికి నేను మరొక రూమ్ కూడా వాడాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పృథ్వీరాజ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈయన పక్కన ఉంటే మనం డైటింగ్ కూడా మర్చిపోతామని పొరపాటున కూడా ఈయన వద్ద నాకు ఇది ఇష్టం అని నోరు జారకూడదని అలా జారితే ఫుడ్ పెట్టి చంపేస్తారు అంటూ ప్రభాస్ ఆతిథ్యం గురించి ఎంతో గొప్పగా చెప్పారు.