అతనికి కాల్ చేసిన సమంత.. ఏడుస్తూ ఎం చెప్పారో తెలుసా..?

సమంత గురించి తెలియని వాళ్లు ఉండరు. ఆమె మొదటగా మోడలింగ్ లో అడుగు పెట్టి 2007లో రవి వర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. కానీ ఆమె తొలి చిత్రం 2010లో ఓ ఏమాయ చేశావే చిత్రంతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో కూడా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత తెలుగులో బృందావనం సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించారు. తర్వాత 2011లో దూకుడు తర్వాత.. ఇంకెన్నో సినిమాల్లో నటించారు. బృందావనం, దూకుడు సినిమాలు ఆమెకు స్టార్ హోదా తెచ్చిపెట్టాయి. దూకుడు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విషయాలను శ్రీను వైట్ల వెల్లడించారు. ఈ సినిమాను ఇస్తాంబుల్ లో షూట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే అక్కడ ఒక రోజు వాళ్లకు షూటింగ్ లేదు. ఆ సమయంలో సమంతకు షాపింగ్ కు వెళ్లమని శ్రీనువైట్ల సూచించాడు. అతడు చెప్పిన విధంగానే ఆమె షాపింగ్ కు వెళ్లింది. అలా ఆమె షాపింగ్ కు వెళ్లిన కొన్ని నిమిషాల తర్వాత ఓ ఘటన జరిగింది. అదేంటంటే.. ఆమె ఎదురుగా ఓ ఆత్మాహుతి జరిగిందని.. దీంతో ఆమె భయపడి పోయి తనకు కాల్ చేసి ఏడుస్తూ చెప్పినట్లు శ్రీనువైట్లు చెప్పాడు.

కాని అక్కడ ఆమె మానవ బాంబ్ ను చూశారట. ఇదిలా ఉండగా.. ఇస్తాంబుల్ లో తాము స్టే చేసిన బిల్డింగ్ 36వ అంతస్తులో ఉండగా.. భూకంపం వచ్చినట్లు తెలిపాడు శ్రీనువైట్ల. అక్కడ చాలావరకు ఇబ్బందులకు గురయ్యామని.. అయినా సమంత ఎక్కడా డిస్టబెన్స్ కాకుండా.. తనకు ఇచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేశారని చెప్పారు.